చారిత్రక గుడిలో అడుగు పెట్టిన మోడీ..ఆ ఫలితం కోసమేనా!
నేపాల్ లో ప్రధాని మోడీ సందర్శించిన దేవాలయాల్లో ఒకటి జానకీ మందిర్. దీన్ని నౌ లాఖ్ మందిర్ అని కూడా వ్యవహరిస్తుంటారు. జానకీ మందిర్ అన్నంతనే సీతమ్మకు ఏదో లింకు ఉంటుందని అనుకుంటారు.
పురాణాల ఆధారంగా సీతమ్మ పుట్టినది నేపాల్ ప్రాంతంలో జనక్ పూర్ అని...జనక మహారాజుకు సీత ఇక్కడే దొరికిందని ... ఆమె యుక్త వయసు వచ్చే వరకు ఈ ప్రాంతంలోనే తిరిగిందని చెబుతారు. ఈ వాదనకు తగ్గట్లే ఇదే ప్రాంతంలో 1600 సంవత్సరంలో ఒక బంగారు విగ్రహం కూడా దొరికింది. ఈ ఆలయానికి సమీపంగా ఒక మండపం కూడా ఉంది..ఈ మండపంలోనే రాముడు సీత పెళ్లి జరిగింది అని కూడా అంటారు.
1910లో ఈ గుడిని రాణి వృషభాను ఈ ఆలయానికి ప్రాధాన్యతనిస్తూ భారీగా నిధులు ఖర్చు పెట్టి ఆలయానికి మార్పులు చేర్పులు చేశారు. తాజాగా మోడీ ఈ ఆలయంలో ప్రవేశించడంతో ఈ ఆలయానికి ప్రాధాన్యత సంతరించుకుంది...దీంతో మోడీ అడుగు ఈ ఆలయంలో పడటంతో పర్యాటకంగా కూడా అంతర్జాతీయ పరంగా మంచి గుర్తింపు వచ్చింది అని కొంతమంది అంటున్నారు.