విన్నారా చంద్రబాబు ప్రధాని అంట….నవ్వుతున్నారు !

KSK
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన రాజకీయ జీవితం గురించి సంచలన కామెంట్ చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చి 20 సంవత్సరాల తరువాత తనకు ప్రధాని పదవి ఆనాడే వస్తే వద్దన్నానని తెలియజేశారు. కేవలం తెలుగు ప్రజల అభివృద్ధి కోసం ఆనాడు ఆ  నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన రాజకీయ జీవితం మొత్తం తెలుగు ప్రజల అభివృద్ధి కోసం ప్రజలకు సేవచేయడం అంటూ పెద్ద పెద్ద మాటలు పత్తిత్తు కబుర్లు చెప్పుకొచ్చారు.

తాజాగా ఇటీవల తెలంగాణలో జరుగుతున్న టీడీపీ మహానాడులో చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. నందమూరి తారకరామారావు అప్పట్లో తెలుగు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఊరుకోలేదు తెలుగుదేశం పార్టీ స్థాపించి దేశ రాజకీయాలలోనే సంచలనం సృష్టించారని తెలిపారు.

అంతేకాకుండా ఆ సమయములో ఎన్టీఆర్‌ నేషనల్ ఫ్రంట్‌కు రూపకల్పన చేశారని అన్నారు . ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, యునైటెడ్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసి దేవెగౌడను ప్రధానిని చేసిన విషయాన్ని ఈ సందర్భంగా బాబు గుర్తు చేశారు. 2019 ఎన్నికల తర్వాత దేశంలో పెను మార్పులు వస్తాయని ..దేశ రాజకీయాల్లో టీడీపీ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు.

ఎంతమంది ఎన్ని రకాల పన్నాగాలు పన్నినా తెలుగుదేశం పార్టీ వెంట్రుక కూడా పీకలేరు అని అన్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేసిందని ఈ సందర్భంగా తెలియజేశారు చంద్రబాబు. అయితే ఈ సందర్భంగా తెలంగాణలో జరిగిన టీడీపీ మహానాడులో బాబు ప్రధాని అనే కామెంట్స్ పై రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు నవ్వుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: