ప్రధానిగా ఐదో సంవత్సరం - నరెంద్ర మోడీకి కొత్త సర్వే పెద్ద ఝలక్
2014 ఎన్నికలు ఒక కల. అసలు 2000 తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అనతి కాలం లోనే ఊహాతీతంగా రాజకీయ మహాప్రస్థానంలో సొంత మెజారిటీతో ఎదిగి అధికారంలోకి రావడం ఒక ఊహాతీత పరిణామమే. అయితే ఎలాంటి పరిస్థితులనైనా తనకు అనుకూలంగా డ్రైవ్ చేసి సానుకూలంగా మార్చుకోవడంలో నరెంద్ర మోడీ వ్యూహం అనితర సాధ్యం.
అయితే, నరెంద్ర మోడీ అంతరాల్లో పదవి తెచ్చిన అహంకారమో, స్వల్పకాలంలోనే సునాయాసంగా దక్కిన అధికారమధమో తెలియదు గాని, ఎదిగినంత వేగంగా పతన మౌతున్న ఇమేజ్ తో మోడీ తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. గతంలో నరెంద్ర మోడీ ఏం చేసినా థ్రిల్లింగ్ గా ఉండేది. కానీ ఇపుడు జనం ఆయన ఏ పథకం తెస్తున్నా ముందుగానే భయపడుతున్నారు. అంతే కాదు అతడి భవిష్యత్తు చర్యలను అతి సులువుగా ఊహించగలుగు తున్నారు.
అయితే, రోజు రోజుకు సాధారణ మీడియాలో అంటే పత్రికల్లో వివిధ చానళ్ళలో అలాగే సామాజిక మాద్యమాల్లో తేడా లేకుండా మోడీ పై జనవ్యతిరేకత పెరుగుతుండటంతో ఇది నిజమేనా? లేక ప్రచారమా? అని ఏబీపీ న్యూస్-సీఎస్డీఎస్ ఒక సర్వే నిర్వహించింది. ఇందులో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. మోడీపై వ్యతిరేకత ఒక ప్రచారం కాదు, నిజం అని చెప్పిందా సర్వే.
హైలెట్స్ ఆఫ్ ది సర్వే — మూడ్ ఆఫ్ ది నేషన్
1. మోడీకి 274 సీట్లు వస్తాయి కానీ ఓట్లు మాత్రం 37% మాత్రమే.
2. కాంగ్రెస్ అంచనాలకు మించి పుంజుకుంది. కాంగ్రెస్కు 31% ఓట్లు-164 సీట్లు, ఇతరులకు 32% ఓట్లు వచ్చే అవకాశం.
3. దక్షిణ భారతం లోని 132 సీట్లలో మోడీ 22 కు మించి గెలిచే అవకాశమే లేదు.
4. రాహుల్ గాంధీ పాపులారిటీ గతంతో పోలిస్తే 8 శాతం పెరిగింది మరో ఏడాదిలో ఇంకా పెరిగే అవకాశమూ ఉంది.
5. ఉత్తర భారతంలో నరెంద్ర మోడీ కంటే కూడా ఇతర పార్టీలకే ఓట్లు ఎక్కువ రావచ్చు.
6. రాజస్థాన్లో ఎన్డీయే పవనాలు వీచట్లేదు ఓడినా ఆశ్చర్య పడనవసరం లేదు.
7. బీఎస్పీ-ఎస్పీ కూటమి ఉత్తరప్రదేశ్లో బీజేపీని మట్టి కరిపిస్తుందట.
8. వాయవ్య భారతంలో మాత్రం లోక్సభలో మోడీ ప్రభావం ఇంకా స్ట్రాంగ్ గానే ఉందంటున్నారు.
9. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ విపరీతంగా పుంజుకుని 49% ఓట్లు సంపాదించే స్థాయికి వచ్చింది.
10. బీహార్, పశ్చిమ బెంగాల్లో కూడా స్థానిక పార్టీలదే బీజేపీ మీద పైచేయిగా ఉంది.
ఈ సర్వేలో ముఖ్యమైన విషయం ఏంటంటే, రాష్ట్రాలను విడి విడిగా చూసి అంచనా వేస్తే నరెంద్ర మోడీ ఇమేజ్ భారీగా దెబ్బతిన్నట్టు కనిపిస్తోంది. కానీ ఈరోజు ఎన్నికలు జరిగితే నరెంద్ర మోడీ బొటా బొటి మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని అంటున్నారు. కానీ ప్రాంతీయ పార్టీల కూటమి ఈ సారి దేశ వ్యాప్తంగా భారీగా ఏర్పాటవుతున్న నేపథ్యంలో మోడీకి కచ్చితంగా అశుభసంకేతాలు మొదలయ్యాయని చెప్పొచ్చు.
నేటికి నరెంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి పాలన ప్రారంభమైన్ సరిగ్గా నాలుగేళ్ళు పూర్తయింది. నరెంద్ర మోడి బృందానికి ఏపి హెరాల్డ్ శుభాకాంక్షలు.