జగన్ యాత్రకు పోలీసులు బ్రేక్..కారణం అదేనా!

Edari Rama Krishna
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ చేస్తున్న అన్యాయాలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ‘ప్రజా సంకల్ప యాత్ర’ ప్రారంభించారు.  గతంలో తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ బాటలోనే నడుస్తూ..ప్రజలకు మరింత చేరువ కావాలని పాదయాత్ర మొదలు పెట్టారు వైఎస్. జగన్. ఇక జగన్ మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు..రాజన్న మళ్లీ మా ముందుకు వచ్చారని స్వాతగతం పలుకుతున్నారు.  ఇప్పటికే రెండు వేల కిలోమీటర్ల పాత యాత్ర చేసిన జగన్ ప్రస్తుతం గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. 

తాజాగా  జగన్ పాదయాత్ర దాదాపు ఏడు నెలలుగా సాగుతుంది. కాని ఎక్కడా లేని ఆటంకం తూర్పు గోదావరి జిల్లాలో వచ్చింది. జగన్ పాదయాత్ర మరో రెండు, మూడు రోజుల్లో తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కొవ్వూరు నియోజకవర్గం నుంచి తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేశించాలంటే గోదావరి వంతెనను దాటాలి. కానీ వంతెన చాలా బలహీనంగా ఉండటం..ఎక్కువ మంది జనాలు ఆ వంతెనపై పయనిస్తే..కూలిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం పాదయాత్రకు అనుమతిని నిరాకరించింది. ఈ మేరకు రాజమండ్రి డీఎస్పీ జగన్ కు లేఖ రాశారు.

గోదావరి వంతెనపై నుంచి కాకుండా వేరే మార్గం ద్వారా రావాలని ఆయన కోరారు. బ్రిడ్జి కండిషన్ సరిగా లేనందునే అనుమతిని ఇవ్వడ లేదని పోలీసులు చెబుతున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా రాజమండ్రిలో కూడా జగన్ బహిరంగ సభకు అనుమతించబోమని పోలీసులు చెబుతున్నారు. అయితే తమ పాద యాత్రల వల్ల ప్రభుత్వానికి భయం వేస్తుందని..అందుకే ఇలాంటి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తే ఊరుకోబోమని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: