చంద్రబాబు నీ కన్నా అంత మాట అనేశాడేంటి..!

KSK
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు ని చెడుగుడు ఆడేసుకున్నారు. తాజాగా ఇటీవల కన్నా లక్ష్మీనారాయణ ఢిల్లీ వెళ్లిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకి సిగ్గు లజ్జా లేదు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికలలో అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి రాజకీయాలు చేస్తున్నారు అంటూ చంద్రబాబుపై రేంజ్ లో మండిపడ్డారు.


తన స్వార్ధ రాజకీయాలకు రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి ఇప్పుడు బీజేపీ పార్టీ ని రాష్ట్ర ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని...అలాగే టిడిపి నాయకులు మరియు ఆ పార్టీకి అండగా ఉండే ఎల్లో మీడియా కూడా తీవ్రంగా కష్టపడుతుంది అని పేర్కొన్నారు.


నాలుగు సంవ‌త్స‌రాలు మంచిగా క‌నిపించిన మోదీ ఇప్ప‌డు వీళ్ల క‌ళ్ల‌కు చెడుగా ఎలా మారాడో చెప్పాల‌ని తెలుగుదేశం నాయ‌కుల‌ను ప్ర‌శ్నించారు. తెలుగుదేశం నాయ‌కులు చేస్తున్న మోసాల‌ను ప్ర‌జ‌ల‌లోకి తీసుకు వెళ్తాం అని,అమిత్ షా త్వ‌ర‌లోనే ఆంధ్ర‌ప్రదేశ్‌లో ప‌ర్యటిస్తార‌ని తెలిపారు.


చంద్ర‌బాబు ఎన్ని నాట‌కాలు ఆడిన 2019లో కూడా బీజేపీనే అధికారంలోకి వ‌స్తుంద‌ని,మోదీ మ‌ళ్లీ ప్ర‌ధాన‌మంత్రి అవ్వ‌డం ఖాయం అని చెప్పుకొచ్చారు కన్నా లక్ష్మీనారాయణ. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబుపై ఆయన ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు...వచ్చే ఎన్నికలలో చంద్రబాబుకి కనీసం డిపాజిట్లు కూడా దక్కవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: