జమ్ము కశ్మీర్లో రాజకీయాల్లో సంచలనం - గవర్నర్ పాలనకు రాజముద్ర
మరో వైపు వీలైనంత వేగంగా జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి గవర్నర్ గా ఎన్ ఎన్ వోహ్రా 2008 లో బాధ్యతలు చేపట్టారు. ఆయన హయాం లోనే నాలుగోసారి గవర్నర్ పాలన కు వెళ్లడం గమనార్హం. ఎన్ ఎన్ వోహ్రా హయంలో తొలిసారిగా 2008 లో కాంగ్రెస్ ప్రభుత్వానికి పీడీపీ మద్దతు ఉపసంహరించు కోవడంతో 174 రోజుల పాటు గవర్నర్ పాలన సాగింది. ఇక 2015 ఎన్నికల్లో హంగ్ ఏర్పడటంతో కొద్ది రోజులు, 2016 లో ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ మరణించడం తో మరోసారి గవర్నర్ పాలనలోకి వెళ్లింది. తాజాగా ఇప్పుడు గవర్నర్ పాలనలోకే వచ్చింది.
ప్రస్తుతం ఆగస్టు 26 వరకు అంటే అమర్నాథ్ యాత్ర ముగిసే దాకా గవర్నర్ పాలన సాగే సూచనలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఆరు మాసాల పాటు గవర్నర్ పాలన కొనసాగించవచ్చు. అంటే ఈ ఏడాది చివరి వరకూ గవర్నర్ పాలన కొనసాగు తుందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. అప్పటికి సాధారణ ఎన్నికలకు మరో మూడు నెలల గడువు మాత్రమే ఉంటుందని దీంతో జమ్మూ కశ్మీర్ శాసనసభకు కూడా అప్పుడే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు అంటున్నాయి.