బాలకృష్ణ యాత్ర చేసిన వచ్చే ఎన్నికలలో ఓట్లు వేసే వారు ఇక్కడ ఎవ్వరు లేరు..!

KSK
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు కుమారుడు ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వియ్యంకుడు మంత్రి నారా లోకేష్ మావయ్య హిందూపురం ఎమ్మెల్యే అయినా నందమూరి బాలకృష్ణ త్వరలో హిందూపురం నియోజకవర్గంలో పల్లెబాట పట్టబోతున్నారట. దీంతో ఈ విషయం తెలుసుకున్న హిందూపురం నియోజకవర్గ ప్రజలు ఎన్నికల ముందు మేము గుర్తొస్తాము ఎన్నికల తర్వాత మళ్లీ ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు అంటూ బాలకృష్ణ చేపట్టే యాత్రపై సెటైర్లు వేస్తున్నారు.

తాజాగా ఇటీవల హిందూపురం నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు హిందూపురంలోని ఎమ్మెల్యే నివాసంలో సమీక్ష సమావేశంలో నిర్వహించారు. రాష్ట్ర ప్ర భుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ఇంటింటా అమలు తీరుపై ప్రజలతో నేరుగా తెలుసుకునేందుకు ఎమ్మెల్యే పల్లెబాట చేయనున్నట్లు టీడీపీ వర్గాలు ప్రకటించాయి.

అంతేకాకుండా ఈ యాత్రలో బాలకృష్ణ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ, ప్రజాసమస్యలను తెలుసుకుని పరిష్కారం చేపట్టేందు కృషి చేస్తారని పేర్కొన్నారు. దీంతో హిందూపురం నియోజకవర్గ ప్రజలు అసలు హిందూపురం నియోజకవర్గానికి పెద్ద సమస్యె బాలకృష్ణ అని అంటున్నారు….

వచ్చే ఎన్నికలలో ఆయన పోటీ చేయకుండా ఉంటేనే నియోజకవర్గం బాగుపడుతుందని పోటీచేసిన ఇక్కడ ఓట్లు వేసే వారు ఎవరూ లేరని అంటున్నారు హిందూపురం నియోజకవర్గ ప్రజలు..అయితే మరోపక్క బాలకృష్ణ నియోజకవర్గంలో యాత్ర చేపడుతున్న నేపథ్యంలో టిడిపి నాయకుల లో కొంత మందికి భయం పట్టుకుంది… దానికి కారణం ఎక్కడ ఈ  యాత్రలో సామాన్య ప్రజలపై బాలకృష్ణ చేసుకుంటాడేమో అని కొంతమంది టిడిపి నాయకులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: