చివరికి చంద్ర బాబు 'అతని' మీద ఆధారపడుతాడా..!

Prathap Kaluva

రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. మొన్నటివరకు  టీడీపి సేఫ్ జోన్ లో ఉన్నది. ఎందుకంటే అతని పక్కన మిత్ర పక్షాలు అన్ని ఉన్నాయి కాబట్టి ఇప్పడూ పరిస్థితి వేరు. మొన్నటివరకు మద్దతు ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పడూ శత్రువు అయినాడు. బీజేపీ కూడా దూరం అయ్యింది. ఇప్పుడే చంద్ర బాబు కి అగ్ని పరీక్ష మొదలైంది. 2019 లో కొత్త మిత్ర పక్షాలను వెతికే పనిలో పడ్డాడు. 


సొంత బలంతో అధికారం అందుకోగలిగినంత సీన్ చంద్రబాబుకు ఏనాడూ లేదు. రేపు అయినా అంతే. చంద్రబాబుకు మిత్రులు కలిసిరాకపోతే చిత్తుగా ఓడటం ఖాయం. అమరావతి, సింగపూర్లు బాబును రక్షించలేవు. జనాలపై ప్రభావం చూపగల వేరే వ్యక్తులు కలిసి వస్తే చంద్రబాబుకు సేఫ్ కావొచ్చు. అలాంటి వారి అన్వేషణలో ఉన్నాడాయన. అందుకు తగ్గట్టుగా అశోక్ బాబును చంద్రబాబు నాయుడు ప్రొజెక్ట్ చేస్తున్నాడు.


వాస్తవానికి అశోక్ బాబుకు ఉన్న సీనేమిటో అందరికీ తెలిసిందే. అతడై అతడు టీడీపీలోకి చేరితే ఊకలో ఈక అవుతాడు. అయితే చంద్రబాబు నాయుడు ముందుగా అశోక్ బాబును ఒక గొప్ప నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ఆయనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని బాబు కితాబిస్తున్నాడు. ఒకటికి నాలుగు సార్లే తనే ఆయనను ఆహ్వానిస్తున్నాడు. తద్వారా అశోక్ బాబు తోపు, తురుము అని చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: