వచ్చే ఎన్నికల్లో జగన్నే ముఖ్యమంత్రి అని తేల్చేసిన చంద్రబాబు ఆస్థాన మీడియా…!

KSK
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం అధినేత ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సర్వేలపై మీడియాపై ఎక్కువ దృష్టి పెట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ పాలన పై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో చంద్రబాబు తన అనుకూల మీడియా తో తనకు మైలేజ్ వచ్చే కార్యక్రమాలను ప్రసారం చేపిస్తున్నారు. మరి ఇదే సమయంలో చంద్రబాబు అనుకూల మీడియా కూడా సర్వేలపై ఎక్కువ దృష్టి సారించింది. అంతలా బాబు నమ్మే సర్వేలు ఇప్పుడు కోలుకోలేని దెబ్బ మిగిల్చింది.


తాజాగా బాబు ఆస్థాన మీడియాకు చెందిన ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ నిర్వహించిన సర్వేలో వచ్చిన ఫలితాలు బాబు గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తున్నాయి. గత ఎన్నికలో టీడీపీ జనసేన మరియు బీజేపీ సహాయంతో గట్టెక్కినా ఈసారి మాత్రం ఆ అవకాశం లేకుండా పోతుందని తేల్చేసింది. అంతేకాకుండా ఆ ఆస్థాన మీడియాలో సంచలన కరమైన విషయాలు బయటపడ్డాయి.


ఇంతకు ఆ విషయం ఏమిటంటే రాష్ట్రం నాశనం అవ్వడానికి కారణం చంద్రబాబే అని ప్రజలు  బలంగా నమ్ముతున్నారట. ముఖ్యంగా విభజన హామీలు రాష్ట్రంలో అమలు అవకపోవడానికి చంద్రబాబు అనుసరించిన వైఖరే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని నిర్లక్ష్యంగా తీసుకుని రాష్ట్రంపై నిర్లక్ష్య వైఖరి చూపించిందని బలంగా ప్రజలు నమ్ముతున్నారని ఆ సర్వేలో వెల్లడయింది.


మరిముఖ్యంగా ఎన్నికలు ఇప్పటికిప్పుడు నిర్వహిస్తే వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని...జగన్ కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని ఆ సర్వేలో వెల్లడైంది. దీంతో ఈ సర్వే రిజల్ట్ విన్నా చంద్రబాబు షాక్ కు గురయ్యారట. మరోపక్క వచ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అవ్వాలని రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారట.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: