కాపు నేత ముద్రగడ చంద్రబాబుకి సరైన స్కెచ్ వేశాడు..!

KSK
చంద్రబాబు గత ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా నోటికి వచ్చిన అన్ని అబద్ధాలు ఆడి రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు అని అనటంలో సందేహం లేదు. చంద్రబాబు ఇచ్చిన ప్రధాన హామీలను ఒకటి ప్రస్తుతం అధికారంలో ఉండటానికి కొంత కారణమైన హామీ కాపులను బీసీల్లో చేర్చడం...అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కాపుల సమస్యపై దృష్టి పెట్టకుండా ఇష్టమొచ్చినట్లుగా రాష్ట్రంలో అవినీతికి తెగబడి తన ఖజానా నింపుకునే కార్యక్రమానికి తెరలేపారు...

దీంతో తమకు తమ జాతిని మోసం చేసినందుకు కాపు సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభం చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు...అనేక ఆందోళనలు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో చంద్రబాబు తన దగ్గర ఉన్న అధికార బలంతో ముద్రగడ్డ చేస్తున్న ఉద్యమాన్ని తోక్కేశారు.

ఇదిలావుండగా తాజాగా ఇటీవల ముద్రగడ పద్మనాభం వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడుని ఓడించడమే కాపు లక్ష్యమని పేర్కొన్నారు...ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ….చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్లే కాపు జాతి రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు. కాపులను మోసం చేసిన చంద్రబాబును సముద్రంలో కలుపుతామన్నారు.

కాపు రిజర్వేషన్లపై.. కచ్చితమైన హామీ ఏ పార్టీ ఇస్తుందో వారికే కాపుజాతి మద్దతిస్తుందని ముద్రగడ తేల్చిచెప్పారు. బీజేపీ, టీడీపీలు సఖ్యతగా ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ బిల్లును పంపలేదని.. బీజేపీ నుంచి టీడీపీ విడిపోయాక బిల్లును పంపారని ముద్రగడ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో...దొంగనాటకాలు కు తెలుగుదేశం పార్టీ నాయకులు దీక్షల రూపంలో తెరలేపారని పేర్కొన్నారు. ఇంత దారుణమైన కాపు జాతిని మోసం చేసిన మోసగాడిని వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో లేకుండా చేస్తామని శపథం చేశారు ముద్రగడ్డ.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: