తమిళనాడు రాష్ట్రంలో క్లాస్ రూమ్ లోనే ఒక విద్యార్థిని చంపేసిన మరో విద్యార్థి…!
తల నేలకు బలంగా తగలడంతో ఆ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. వారం రోజుల క్రితం (జూలై 16న) ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఉదంతం మొత్తం క్లాస్ రూమ్ లోని సీసీ కెమెరాలో రికార్డు అయింది. భోజన విరామ సమయంలో టెన్త్ క్లాస్ కి చెందిన ఇద్దరు స్టూడెంట్స్ మధ్య గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. వీధి రౌడీలా గొడవల తరహాలో ఓ స్టూడెంట్ మరో విద్యార్థిని క్లాస్ రూమ్లో నేలకేసి కొట్టాడు.
అయితే కిందపడిన విద్యార్థి పైకి లేస్తాడనుకున్నా...అప్పటికే అతడు చనిపోయాడు. కాగా మృతి చెందిన విద్యార్థి కుటుంబసభ్యులు మాత్రం కావాలనే తమ కుమారుడిని తోటి విద్యార్థి హతమార్చాడంటూ ఆరోపించారు. అంతేకాకుండా ఆ విద్యార్థి ఇంటిపై దాడి చేసి, నిప్పు పెట్టారు.
ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ విద్యార్థి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ కి సంబంధించిన అధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. తాజాగా జరిగిన ఈ ఉదంతంతో స్కూల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు చాలా భయాందోళనకు గురవుతున్నారు.