జగన్ కి సపోర్ట్ చేస్తున్న కాంగ్రెస్ నాయకుడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి..!
ఈ క్రమంలో పార్టీలోని గ్రూపు తగాదాలు పెరిగిపోతున్నాయట..దీంతో మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయట. కాంగ్రెస్లో సుధీర్ఘకాలంనుంచి ఉన్న రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు, కిరణ్కుమార్రెడ్డిల మధ్య వర్గపోరు నడుస్తోందట.. ఇద్దరికీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని, పార్టీని బలోపేతం చేసే విషయంలో కాకుండా ఒకరు జగన్ కు మరొకరు చంద్రబాబుకు మద్దతు ఇవ్వడానికి ఉవ్విళ్లూరుతుండడంతో ఇబ్బందులు కలుగుతున్నాయని తెలుస్తోంది.
మొదటినుంచి కాంగ్రెస్లో ఉండి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డికి ఆత్మగా వ్యవహరించిన కేవీపీ తన స్నేహితుడి కుమారుడు జగన్మోహన్రెడ్డిని గతంలో ఓసారి వదులుకున్నాం కనుక ఇప్పుడు ఆయనకు ఎలాగో అండగా ఉండలేము కానీ టీడీపీకి సపోర్ట్ ఇవ్వొద్దని చెప్తుంటే ఈ మాజీ ముఖ్యమంత్రి మాత్రం ప్రస్తుత ముఖ్యమంత్రికి మద్దతివ్వాలంటున్నారట..
జగన్ బలహీనమైతే కాంగ్రెస్ పుంజుకుంటుందని వాదిస్తున్నారట. వీరిద్దరి మధ్య జరుగుతున్న గొడవ ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దల దృష్టిలో కి వెళ్లినట్లు సమాచారం. మరి కాంగ్రెస్ అధినాయకత్వం ఎవరి వాదనకు మద్దతు తెలుపుతుందో చూడాలి.