చంద్రబాబుపై చేసిన కామెంట్లకు సోము వీర్రాజు కి షాక్ ఇచ్చిన రాష్ట్ర ప్రజలు…!

KSK
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాష్ట్ర బీజేపీ నేతలు బరితెగిస్తున్నారు. విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన హామీల విషయంలో మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నష్టాలు కష్టాలు పాలు చేసిన బిజెపి ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాష్ట్ర బిజెపి నేతలతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.


రాష్ట్రం కోసం నిరంతరం కష్టపడుతూ కేంద్రంతో పోరాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ వ్యూహాలను ఎదుర్కొంటున్న చంద్రబాబుపై బురదజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చంద్రబాబుపై అర్థంపర్థంలేని ఆరోపణలు చేయడానికి రెడీ అయిపోయారు. తాజాగా ఇటీవల మీడియా సమావేశం నిర్వహించిన సోమువీర్రాజు చంద్రబాబుపై వ్యక్తిగత ఆరోపణలు తోపాటు కక్షగట్టిన విధంగా ప్రాణాలు తీసేస్తాం అంటూ పెద్ద పెద్ద డైలాగులు వేశారు.



దీంతో సోమువీర్రాజు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు గతంలో ఇలానే కర్నూలు ఉప ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్ కూడా ఇదే స్వరంతో చంద్రబాబుపై విరుచుకుపడిన నేపద్యంలో...కర్నూలు ప్రజలు వైసీపీ అధినేత జగన్ కి దిమ్మతిరిగిపోయే విధంగా ఉపఎన్నికలలో సరైన తీర్పు ఇచ్చి టిడిపికి అండగా నిలిచారు. ఈ క్రమంలో తాజాగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై కూడా రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు.


తాజాగా ఇటీవల సోమరాజు మాట్లాడుతూ..“2019లో అలిపిరి రిపీట్ అవుద్ది.. రెడీగా ఉండండని” అంతేకాకుండా “చంద్రబాబును ఏదైనా నీళ్లు లేని బావిని చూసుని దూకండి” అని “పంచభూతాలు పగబడతాయి…జాగ్రత్తగా ఉండాలని..” ఇలాంటి కామెంట్లు చేయడంతో సోము వీర్రాజు మాటతీరును అసహ్యించుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు. రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసిన బిజెపి నేతలకే ఇటువంటివి వర్తిస్తాయని సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సామాన్య ప్రజలు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: