సమస్యలు పరిష్కారం కావాలంటే అందుకు రాజకీయాలే పరమావధి కాదంటూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనేక వేదికల ద్వారా సమస్యలు తీర్చవచ్చునని, చిత్తశుధ్ధి ప్రధానమని అన్నారు. విశాఖలో ఈ రోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, తాను రాజకీయాలలోకి వచ్చే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ప్రస్తుతం తన ఆలొచనలు అన్నీ ఏపీలో రైతుల మీదనే ఉన్నాయని చెప్పుకొచ్చారు.
అపుడే చెబుతా :
ప్రస్తుతం తాను జిల్లాల టూర్లలో ఉన్నానని చెప్పిన లక్ష్మీనారాయణ అన్ని జిల్లాలు తిరిగేశాకే ఒక నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు. ఇప్పటికి ఎనిమిది జిల్లాలలో పర్యటనలు పూర్తి చేశానని, విశాఖ టూర్ తొమ్మిదవదని ఆయన చెప్పారు.
అవగాహన ముఖ్యం :
రాజకీయాలలోకి వచ్చేవారెవరికైనా సామజిక సేవ చేయాలనుకునేవారికైనా సమస్యలపై ఓ అవగాహన ఉండాలని మాజీ జేడీ అభిప్రాయడ్డారు. అందుకే తాను రైలులు, విధ్యార్ధులతో భేటీఅ అవుతున్నానని, వారే దేశానికి కావాల్సిన వారని అన్నారు. విశాఖలో ఏడు రోజుల పాటు జేడీ ఉంటారట.