హిజ్రా వేషం తో ఆ టీడీపీ ఎంపీ పరువు తీస్తున్నాడు..!

Prathap Kaluva

టీడిపి ఎంపీ శివ ప్రసాద్ పార్లమెంట్ లో రోజుకొక వేషం తో నిరసన తెలుపుతున్నాడు. అయితే ఈ వేషాలు వేస్తే ప్రత్యేక హోదా వస్తుందా.. అంటే రాదనే చెప్పాలి. కానీ ఈ వేషాలతో ఆంధ్ర ప్రదేశ్ పరువు పోతుందని చెప్పాలి. నిరసన తెలపాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. కానీ ఇటువంటి పిచ్చి ''వేషాలు'' ఎందుకు వేస్తున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వేషధారణ జాతీయ మీడియాలో ప్రధాన ఆకర్షణంగా నిలుస్తోంది. 


 రోజుకో వేషంతో  శివప్రసాద్ హల్ చల్ చేస్తున్నాడు గురువారం హిట్లర్ వేషంలో వచ్చారు. శుక్రవారం హిజ్రాగా వచ్చి సందడి చేశారు. చెవులకు రింగులు, భుజంపై ఎరుపు రంగు పైట, తలలో కనకాంబరాలు పెట్టుకుని పార్లమెంట్ ప్రాంగణంలోకి శివప్రసాద్ వచ్చారు. అయితే ఈ వేషాలు చూడటానికి చాలా ఎబ్బెట్టుగా ఉందని మాటలు వినిపిస్తున్నాయి. 

 

నేను థర్డ్ జండర్ల ప్రతినిధిగా మోడీని నిలదీయడానికి వచ్చానని చెబుతూ, "మోడీ బావా.." అంటూ తనదైన శైలిలో చప్పట్లు కొట్టారు. "ప్రత్యేక హోదా ఇవ్వకుంటే నీ అంతం ఆరంభం" అంటూ ఓ గీతాన్ని ఆలపించారు. మాటలెన్నో చెప్పావుగానీ, చేతల్లో ఏమీ చూపలేదంటూ సెటైర్లు వేశారు. ఆయన వేషధారణ చూసిన సహచర ఎంపీలతో పాటు మీడియా మిత్రులు పగలబడి నవ్వారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: