2019 ఎన్నికలలో నేనే ముఖ్యమంత్రి అంటున్న పవన్ కళ్యాణ్..!

KSK
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజాపోరాట రెండవ విడత యాత్ర లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల తాజాగా తణుకు నియోజకవర్గంలో జరిగిన సభలో ఆంధ్రరాష్ట్రంలో ఉన్న ఆడపడుచులకు అధికారంలోకి వస్తే ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ ఇస్తానని సంచలన హాలు ప్రకటించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రజా పోరాట యాత్ర ముగించుకొని పశ్చిమగోదావరి జిల్లాలో తన యాత్రను ప్రారంభించిన పవన్..ఈ జిల్లాలో అనేక సంచలనాలు సృష్టించారు.


ఈ క్రమంలో ఇటీవల రాబోయే ఎన్నికలు చాలా కీల‌కం అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అంతేకాదు వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ముఖ్య‌మంత్రి అవుతాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ప‌వ‌న్. ప్ర‌జ‌ల ఆశీస్సులు త‌ప్ప‌కుండా ఉంటే తాను 2019లో ఖ‌చ్చితంగా ముఖ్య‌మంత్రి అవుతాన‌ని స్ప‌ష్టం చేశారు.


గ‌తంలో తెలుగ‌దేశం పార్టీకి ఓట్లు వేసి మోస‌పోయామ‌ని మ‌ళ్లీ 2019లో టీడీపీకి ఓటు వేస్తే అది ద్రోహం అవుతుందని ఆయ‌న ఆరోపించారు. రాజ‌కీయాల్లో ఏ నాయ‌కుడుకి అయినా స‌హ‌నం ఉండాల‌ని అది నాలో ఉంద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలిపారు.


ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రోజుకు ఒక మాట మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌జ‌లను మోసం చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.  విభజనకు గురైన ఆంధ్రరాష్ట్రాన్నిప్రస్తుతం రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర సమస్యలను రాజకీయం చేస్తున్నారని సంచలన కామెంట్లు చేశారు పవన్.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: