2019లో జగన్నే ముఖ్యమంత్రి చేసుకుంటాం అని అంటున్న టిడిపి కీలక ఓటుబ్యాంకు ఓటర్లు…!

KSK
ఎన్నికలు దగ్గరకొస్తున్న నేపద్యంలో మాటమీద నిలబడే జగన్ స్పష్టమైన హామీలు ఇస్తూ ప్రజా సంకల్ప పాదయాత్రలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో 2014 ఎన్నికలలో అబద్ధపు హామీలు ఇచ్చి నెరవేర్చలేని అమలు కాలేని ప్రకటనలు చేసి ప్రజలను రైతులను ముఖ్యంగా యువకులను నిరుద్యోగులను మహిళలను మోసం చేసిన చంద్రబాబుని ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రకటనలు చేస్తూ వారిలో ధైర్యాన్ని నింపుతూ ముందుకెళ్తున్నారు జగన్.


ఈ క్రమంలో గత ఎన్నికలలో చంద్రబాబు చేతిలో మోసపోయిన వారు జగన్ పాదయాత్రలో తమ బాధలను చెప్పుకుంటూ బాధపడుతున్నారూ. ఈ క్రమంలో పాదయాత్రలో జగన్ సంచలనమైన హామీలు ఇస్తూ..ప్రజలకు ధైర్యం నింపుతున్నారు. రాబోయే రోజులు మంచివి అని ప్రజలందరూ ధైర్యంగా ఉండి...అబద్ధాలు మోసాలు చేసే రాజకీయ నాయకులను రాబోయే ఎన్నికలలో తరిమికొట్టాలని పాదయాత్రలో ప్రజలకు పిలుపునిస్తున్నారు.


ఈ క్రమంలో గత ఎన్నికలలో చంద్రబాబు చేతిలో మోసపోయిన విశ్వబ్రాహ్మణ సామాజికవర్గానికి చెందినవారు వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర లో విశాఖలో మొదటి అడుగు వేసిన దగ్గరనుంచి విజయనగరం దాక జగన్ వెంటే నేడుస్తాం అని తీర్మానం చేసారు. గతంలో వైస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసినప్పుడు తమకు మద్దతు తెలిపిన విశ్వబ్రాహ్మణాలను రాజశేఖరరెడ్డి గారు అధికారంలోకి రాగానే తమను గుండెల్లో పెట్టుకు చూసుకున్నారు అని జగన్ కు వాళ్ళు గుర్తుచేశారు.


ఇప్పుడు అయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి విశాఖలో ఎలా అడుగు అడుగు వేస్తారో జగన్ తో కలిసి మేము కూడా అలాగే అడుగువేస్తాం అని చెప్పారు . 2014 ఎన్నికల్లో చంద్రబాబు ని నమ్మి వోట్ వేసాము కానీ అయన మమల్ని మోసం చేసారు అని తమ బాధను వెళ్లబుచ్చారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా జగన్ ముఖ్యమంత్రి అవుతారని..ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణులు మొత్తం వైసీపీ పార్టీకి అండగా ఉండి జగన్ను ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెడతామని అంటున్నారు విశ్వబ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన పెద్దలు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: