లోకేష్ కోసం చంద్ర బాబు కొత్త ప్లాన్ ... దిమ్మ తిరగాల్సిందే...!

Prathap Kaluva

చంద్ర బాబు నాయుడు లోకేష్ ను ఎక్సపోజ్ చేయడానికి నానా తంటాలు పడుతున్నాడు. తన తరువాత లోకేష్ కు పార్టీ పగ్గాలు ఇవ్వడానికి ఇప్పటి నుంచే కొత్త వ్యూహాలు రచిస్తున్నాడు. టీడీపీ సీనియర్ నాయకుల నుంచి వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్నాడు.  ఇక్కడే ఆయన ఓ బృహత్తర ప్రణాళిక రచించారు. లోకేష్ ను పైపైకి తీసుకువస్తే, మానవ సహజమైన సైకాలజీ ప్రకారం ఈ వృద్ధతరం తెలుగుదేశం నాయకులకు, అతగాడి ఆలోచనలకు పొసగకపోవచ్చు.


పిల్ల వచ్చి తల్లిని వెక్కిరించిన చందంగా ఫీల్ కావచ్చు. అందుకే ముందు ఈ వృద్ధతరాన్ని తెలుగుదేశంలోంచి సాగనంపాలి. అందుకే ఎవరు ఎవరికి వారసులున్నారో, వారందరికీ రాజకీయ శిక్షణ, ప్రజల్లో తిరగడం అలవాటు చేయమని లోపాయికారీగా చెప్పేసారు. ఇది వృద్దతరానికి కూడా ఆనందం కలిగించింది. తమ అధికార ప్రాభవం తమతో ఆగిపోకుండా, తమ వారసులకు అందుతుందీ అంటే ఎవరికి ఆనందం వుండదు.


2014 నుంచి ఎవరికి వారు తమ తమ వారసులను నియోజకవర్గాలో బయటకు రప్పించారు. వీరిలో 20 ఏళ్ల నుంచి ముఫైఏళ్ల వారు వున్నారు. ఎక్కడ అక్కడ నాన్నల ఫోటోల పక్కన బుడ్డోళ్ల ఫోటోలు, ఫ్లెక్సీలు రెడీ అయిపోయాయి. ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లే జనాలకు ఈ పిల్లల పలకరింపులు, పరామర్శలు ఎక్కవయ్యాయి. జనాలకు కూడా ఎవరో ఒకరు సమాధానం చెప్పేవారు, గోడు వినేవారు కావాలి. సో, ఆ విధంగా వారసులు జనాలకు పరిచయం అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: