పబ్లిసిటీ కోసం పవన్ పరువు తీసిన పవన్ అభిమానులు..!

KSK
కేరళ వరద బాధితుల కోసం ఇటీవల పవన్ కళ్యాణ్ రెండు కోట్ల విరాళం ఇచ్చారు అని పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ ఊదరగొట్టరు. ఈ క్రమంలో అసలు నిజమెంతో తెలుసుకోవాలని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జనసేన పార్టీ కి ఫోన్ చేసి పవన్ కేరళ వరదబాధితుల విరాళాల సంగతి ఆరాతీయగా అందులో అసలు నిజం లేదని జనసేన పార్టీ నాయకులు తేల్చిచెప్పేశారు.


అసలు పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు కేరళ వరద బాధితులకు ఈ రకంగా కానీ పార్టీపరంగా గాని సాయం ప్రకటించలేదని అన్నారు. కోంతమంది ఒక గ్రూప్ గా తయారై పవన్ 2కోట్లు కేరళ వరదబాదితులకు సహయం చేసాడు అని ప్రచారం చేసారు.


ఈ వార్తని సోషల్ మీడియాలో వైరల్ అవగానే జనాలు కూడా పవన్ 2కోట్లు సహయం చేసాడు అని నమ్మేసారు. అయితే అసలు విషయం బయటకు తెలియడంతో సోషల్ మీడియాలో నెటిజనులు పవన్ కళ్యాణ్ అభిమానుల పై మండిపడ్డారు.


వరద బాధితుల విషయంలో కూడా రాజకీయం చేసి అతిగా స్పందించటం పబ్లిసిటీ సంపాదించాలనుకోవటం నీచాతి నీచం అని చీవాట్లు పెట్టారు నెటిజన్లు. మొత్తమ్మీద చూసుకుంటే పవన్ అభిమానుల అత్యుత్సాహం వల్ల పార్టీకి పవన్ పొలిటికల్ కెరియర్ కి ఎప్పటికైనా ప్రమాదం వాటిల్లే పరిస్థితి రావొచ్చని అంటున్నారు కొంతమంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: