పబ్లిసిటీ కోసం పవన్ పరువు తీసిన పవన్ అభిమానులు..!
అసలు పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు కేరళ వరద బాధితులకు ఈ రకంగా కానీ పార్టీపరంగా గాని సాయం ప్రకటించలేదని అన్నారు. కోంతమంది ఒక గ్రూప్ గా తయారై పవన్ 2కోట్లు కేరళ వరదబాదితులకు సహయం చేసాడు అని ప్రచారం చేసారు.
ఈ వార్తని సోషల్ మీడియాలో వైరల్ అవగానే జనాలు కూడా పవన్ 2కోట్లు సహయం చేసాడు అని నమ్మేసారు. అయితే అసలు విషయం బయటకు తెలియడంతో సోషల్ మీడియాలో నెటిజనులు పవన్ కళ్యాణ్ అభిమానుల పై మండిపడ్డారు.
వరద బాధితుల విషయంలో కూడా రాజకీయం చేసి అతిగా స్పందించటం పబ్లిసిటీ సంపాదించాలనుకోవటం నీచాతి నీచం అని చీవాట్లు పెట్టారు నెటిజన్లు. మొత్తమ్మీద చూసుకుంటే పవన్ అభిమానుల అత్యుత్సాహం వల్ల పార్టీకి పవన్ పొలిటికల్ కెరియర్ కి ఎప్పటికైనా ప్రమాదం వాటిల్లే పరిస్థితి రావొచ్చని అంటున్నారు కొంతమంది.