ఆ ఇద్దరి మధ్యనా మళ్ళీ వార్... సరిగ్గా అయన ఉన్న టైంలోనే !!

Satya
చాలాకాలంగా నిశ్శబ్దంగా ఉన్న విశాఖ జిల్లా రాజకీయాలు మళ్ళీ వేడెక్కుతున్నాయి. ఓ వైపు వైఎస్ జగన్ పాదయాత్ర జోరుగా సాగుతోంది. మరో వైపు టీడీపీలోనూ ఆ ప్రకంపనలు కనిపిస్తున్నాయి. దీనితి తోడు ఆ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న ఆ ఇద్దరి వైరం కూడా మరో మారు తెర‌
 పైకి వచ్చింది. డీ అంటే డీ అంటున్నారు.. సరి కొత్త వార్ కి రెడీ అంటున్నారు.

 

గంటాపై ఫైర్ :
 


విశాఖ జిల్లాలో ఇద్దరు మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉంటుంది. ఈ మధ్యన కొంత తగ్గినట్లుగా ఇద్దరూ కనిపించారు కానీ అది టెంపరరీ అన్నది తెలిసిపోయింది. లేటెస్ట్ గా గంటాకు ఇందైరెక్ట్ వార్నింగ్ ఇస్తూ మంత్రి అయ్యన్న చేసిన ఘాటు కామెంట్స్  మరో మారు జిల్లాలోనూ, టీడీపీలోనూ హీట్ పుట్టించాయి.


 
అక్కడ నిర్మిస్తే ఊరుకోను :
 


మంత్రి అయ్యన్న ఇలాకాలో ఆర్టీసీ కాంప్లెక్స్ స్థలంలో మల్టీప్లెక్స్ కోసం అప్పట్లో ప్రభుత్వం గంటాకు చెందిన ప్రత్యూషా సంస్థకు లీజుకు ఇచ్చింది. దానిపై పెద్ద దుమారం రేగడంతో గంటా వెనక్కి తగ్గి ఆ లీజు కాంట్రక్ట్ ను వేరే వారికి ఇచ్చేశారు. రెండు రోజుల క్రితం ఆ సంస్థ అక్కడ మల్టీప్లెక్స్ కోసం నిర్మాణం పనులు చేపట్టడంతో అయ్యన్న అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. ఈ రోజు స్వయంగా అక్కడికి వెళ్ళి  మరీ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. ఎట్టి పరిస్థితులలోనూ  మల్టీప్లెక్స్ అక్కడ నిర్మిస్తే చూస్తూ ఊరుకోనని మంత్రి అయ్యన్న వార్నింగ్ ఇచ్చెశారు.
 
అదేనా అనుమానం :


 
పేరుకు వేరే సంస్థ అయినా అది గంటాకు చెందినదేనన్న  అనుమానాలు మంత్రిలో ఉన్నాయని టాక్. అందుకే మల్టీప్లెక్స్ నిర్నాణం జరగనివ్వనని, దానిని అడ్డుకోవడానికి ఎందాకైనా వెళ్తానని అయ్యన్న హెచ్చరికలు పంపారు. మరి. ఇండైరెక్ట్ గానే అయినా ఇది గంటాను ఉద్దేశించేనని జిల్లా రాజకీయాలలో టాక్ నడుస్తోంది. దీనికి గంటా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. విశాఖ టూర్లో సీఎం చంద్రబాబు ఉండగా అయ్యన్న ఇలా కామెంట్స్ చేయడాన్ని బట్టి చూస్తే కొత్త తల నొప్పులు బాబుకు మొదలయ్యాయనిపిస్తోంది.
 
 
 
 
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: