చంద్ర బాబు కామెడీ ముంబై కు చేరింది...!

Prathap Kaluva

చంద్ర బాబు ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నప్పుడు ఏం మాట్లాడిన అది పెద్ద మేధావి స్పీచ్ మాదిరిగా తెలుగు న్యూస్ చానెల్స్ కవర్ చేస్తాయి. అయితే చంద్ర బాబు ఇవే మాటలు ముంబైలో మాట్లాడే సరికే జాతీయ మీడియా లో హైలైట్ అయ్యింది. ఏపీ వరకే కాదు.. చంద్రబాబు నాయుడు ముంబై వరకూ వెళ్లి మరీ కామెడీగా, కంగాళీగా మాట్లాడాడు. అందులో ముఖ్యాంశాలు ఏమిటంటే.. అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని ప్రకటించడం.


ఇదివరకూ చాలాసార్లు ప్రకటించాడనుకోండి. ఈసారి ముంబైలో ప్రకటించాడు. అమరావతిలో ఒలింపిక్స్ అని. ఇలా మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడును ఏమనాలి? ఒలింపిక్స్ నిర్వహించడం అంటే.. అరువు ఆటగాళ్లను పిల్చుకుని వచ్చి హైదరాబాద్ లో జాతీయ క్రీడలు పెట్టినట్టుగా అని చంద్రబాబు నాయుడు అనుకొంటూ ఉండవచ్చు. అసలు ఒలింపిక్స్ నిర్వహణ ఆతిథ్య హక్కులు.. వాటి పూర్వాపరాలు, ఒలింపిక్స్ ను ఇంతవరకు ఏయే దేశాలు నిర్వహించాయి.. నిర్వహణ తర్వాత వాటి పరిస్థితి ఏమిటి? భవిష్యత్తులో ఏయే దేశాలు ఒలింపిక్స్ నిర్వహణకు సిద్ధంగా ఉన్నాయి.. వంటి అంశాల గురించి ప్రాథమిక అవగాహన ఏమైనా ఉంటే చంద్రబాబు ఇలా మాట్లాడడు.


ఒలింపిక్స్ నిర్వహించడం అంటే.. అరువు ఆటగాళ్లను పిల్చుకుని వచ్చి హైదరాబాద్ లో జాతీయ క్రీడలు పెట్టినట్టుగా అని చంద్రబాబు నాయుడు అనుకొంటూ ఉండవచ్చు. అసలు ఒలింపిక్స్ నిర్వహణ ఆతిథ్య హక్కులు.. వాటి పూర్వాపరాలు, ఒలింపిక్స్ ను ఇంతవరకు ఏయే దేశాలు నిర్వహించాయి.. నిర్వహణ తర్వాత వాటి పరిస్థితి ఏమిటి? భవిష్యత్తులో ఏయే దేశాలు ఒలింపిక్స్ నిర్వహణకు సిద్ధంగా ఉన్నాయి.. వంటి అంశాల గురించి ప్రాథమిక అవగాహన ఏమైనా ఉంటే చంద్రబాబు ఇలా మాట్లాడడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: