నందమూరి కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయా... !

Prathap Kaluva

నందమూరి కుటుంబం లో  రోడ్డు ప్రమాదాలు వారిని కన్నీరు మున్నీరు చేస్తున్నాయి. ఇప్పటికే హరికృష్ణ కొడుకు జానకి రామ్ రోడ్డు ప్రమాదంలో మరణించగా ఇప్పుడు హరికృష్ణ కూడా అదే విధంగా మరణించాడు.  2009లో తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేసి హైదరాబాద్ కు తిరిగి వస్తున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ భారీ యాక్సిడెంట్ కు గురయ్యాడు , తీవ్ర గాయాలతో మొత్తానికి ప్రాణాలతో బయటపడ్డాడు ఆ సంఘటన నందమూరి కుటుంబంలో ఒక కుదుపు కుదిపింది.


అయితే ఎన్టీఆర్ తిరిగి కోలుకున్నాడు అంతా బాగుంది అని అనుకుంటున్న సమయంలో 2014లో డిసెంబర్ 6న రోడ్ యాక్సిడెంట్ లో హరికృష్ణ పెద్దకొడుకు నిర్మాత నందమూరి జానకిరామ్ చనిపోయాడు. హరికృష్ణకు పెద్దకొడుకు జానకిరామ్ అంటే అంతులేని ప్రేమ దాంతో పెద్దకొడుకు మరణాన్ని తట్టుకోలేకపోయాడు, కొంతకాలం నిర్వేదంలోనే ఉండిపోయాడు. ఇక ఈరోజు తెల్లవారు ఝామున నెల్లూరుజిల్లా కావలిలో జరిగే ఓ పెళ్లి వేడుకలో పాల్గొనడానికి వెళ్తున్న హరికృష్ణ కారు అదుపుతప్పి భారీ యాక్సిడెంట్ కు లోనవ్వడంతో తనువు చాలించాడు.


దాంతో నందమూరి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. హరికృష్ణ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయా? అంటే ఔననే సమాధానం వస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తృటిలో చావు నుండి తప్పించుకోగా, పెద్ద కొడుకు జానకిరామ్ ఇదే రోడ్డు ప్రమాదంలో చనిపోవడం ఇప్పుడేమో హరికృష్ణ చనిపోవడం ఆ కుటుంబాన్ని మరింతగా కృంగదీస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: