హరికృష్ణ అంతిమయాత్ర లో చంద్రబాబు చేసిన అతి పెద్ద తప్పు..!

KSK
ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రం లో తెలుగుదేశం పార్టీపై తీవ్ర వ్యతిరేకత ప్రజలలో ఉన్న నేపథ్యంలో చంద్రబాబు...పార్టీని పైకి తీసుకురావడానికి..ప్రజలలో నమ్మకం కలిగించడానికి నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల 2014 ఎన్నికలలో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు...గత నాలుగు సంవత్సరాలు నిరుద్యోగ భృతి గురించి మాట్లాడకుండా..ఇప్పుడు ఎన్నికలు వస్తున్న తరుణంలో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ప్రజల ఓట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిపోయారు.

ఇదిలా ఉండగా ఇటీవల టిడిపి పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు గారి కుమారుడు..మాజీ రాజ్యసభ సభ్యుడు..టిడిపి నాయకుడు నందమూరి హరికృష్ణ మరణించడంతో..చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో చంద్రబాబు హరికృష్ణ మరణాన్ని తన రాజకీయ మైలేజీ కోసం వాడేసుకున్నారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు భజన చేసే పచ్చ మీడియా తో హరి పాడె మోసిన చంద్రబాబు అంటూ తనకు అనుకూలంగా కథనాలను ప్రసారం చేసింది. అయితే చంద్రబాబు తన రాజకీయ మైలేజీ కోసం చేసిన ఈ పని విమర్శల పాలు చేసింది. ఈ తీరు సంప్రదాయ విరుద్ధంగా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

హిందూ సంప్రదాయ పద్ధతుల ప్రకారం బాబు  తీరు వివాదాస్పదం అవుతోంది.అదెలాగంటే.. వియ్యపు వారి పాడెను వియ్యంకులు మోయరనేది హిందూ సంప్రదాయం. అందుకు భిన్నంగా చంద్రబాబు నాయుడు హరి అంత్యక్రియల్లో వ్యవహరించాడు. ఇదంతా చంద్రబాబు నాయుడు రాజకీయ మైలేజీకి చేసిన పనే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: