వైయస్ జగన్ కచ్చితంగా..తన తండ్రి కలలను నెరవేరుస్తాడు: విజయమ్మ!
ఇందుమూలంగా నే వైయస్ బిడ్డగా...తన తండ్రిని ఆదరించిన రాష్ట్ర ప్రజలను ఆదుకోడానికి ..గతంలో తన తండ్రి పై చూపించిన ప్రేమకు కృతజ్ఞతగా మంచి పాలన ఇవ్వడానికి జగన్ ప్రజల ముందుకు వచ్చారని, అతనిని ఆశీర్వదించాలని వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా వైయస్ రాజశేఖర్ రెడ్డి కారణజన్ముడని, ఆయన చేసిన కార్యక్రమాలు, పథకాలు కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని ఆమె అన్నారు.
వైఎస్సార్ ఆశయాలను కాపాడేందుకు జగన్బాబు ప్రజాసంకల్పయాత్రలో ప్రజలందరి దగ్గరకు వస్తున్నారు. ఆయనను ఆశీర్వదించండి. జగన్ ప్రజలందరికీ అండగా ఉంటాడు. మీ అందరికి ఒక అన్నగా, తమ్ముడిగా, ఒక మనవడిగా కాపాడుతాడు.
రాజశేఖరరెడ్డి రాజ్యాన్ని మరల తెచ్చుకుందాం. వైఎస్ జగన్కు అండగా నిలువండి’ అని భావోద్వేగంగా విజయమ్మ విజ్ఞప్తి చేశారు. ఇదే క్రమంలో వైఎస్ సమాధి వద్ద వైఎస్ కుటుంబ సభ్యులు...వైయస్సార్ సిపి పార్టీ నాయకులు నివాళులర్పించారు.