పోలీస్ స్టేషన్ ముందే.. వివాహిత ఆత్మహత్యాయత్నం!

Edari Rama Krishna
దేశంలో కొంత కాలంగా మహిళలపై అఘాయిత్యాలు బాగా పెరిగిపోయాయి.  ప్రతిరోజు ఎక్కడో అక్కడ అత్యాచారాలు, హత్యలకు పాల్పపడుతున్నారు.  ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కొంత మంది కామాంధులు ఇలాంటి చర్యలకు పాల్పపడుతున్నారు.  తాజాగా ఓ ఆకతాయి చేసిన పనికి మనస్థాపం చెందిన వివాహిత ఆత్మహత్యా యత్నం చేసుకుంది. 

వివరాల్లోకి వెళితే..నగరంలోని బోయిన్ పల్లికి  సబితను వెంకటేశ్‌ అనే పోకిరీ వేధిస్తున్నాడు. దొంగచాటుగా పోటోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు.  తన మాట వినకపోతే నీ జీవితం నాశనం చేస్తానని బెదిరించసాగాడు. దాంతో సబిత పోలీసులకు సబిత పిర్యాదు చేసింది.

దీనిపై పోలీసులు సరిగా స్పందించకపోవడంతో మనస్తాపానికి గురైన సబిత పీఎస్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది.  వెంటనే పోలీసులు స్పందించి ఆమెను రక్షించి గాంధీ ఆస్పత్రికి తరలించారు.   పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. సబితకు నాలుగేళ్ల క్రితం దినేష్‌తో వివాహం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: