ఆపరేషన్ గరుడ: త్వరలో చంద్రబాబు కి నోటీసులు...నటుడు శివాజీ కామెంట్స్ ..!
ఈ నేపథ్యంలో తాజాగా టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ని ముఖ్యమంత్రి పదవి నుండి తీసేయడానికి ఢిల్లీ బీజేపీ పెద్దలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సంచలన కామెంట్లు చేశారు శివాజీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న కేంద్ర ప్రభుత్వం అందుకోసం రూపొందించిన ఆపరేషన్ గరుడను మరో రూపంలో అమలు చేయబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యాలు చేశారు.
ఈ ఆపరేషన్లో భాగంగా త్వరలో సిఎం కు కేంద్రం నోటిసులు జారీ చేస్తున్నట్లు తనకు సమాచారం అందిందన్నారు. అంతేకాకుండా నటుడు శివాజీ మాట్లాడుతూ నేను వ్యక్తిగతంగా ఎవరికి ఏ పార్టీకి మద్దతు తెలపడం లేదని..చంద్రబాబు స్థానంలో జగన్ గారు ఉన్న ఇలానే మాట్లాడతానని పేర్కొన్నారు.
దీంతో ఇప్పుడు నటుడు శివాజీ చేసిన కామెంట్లు రెండు తెలుగు రాష్ట్రాలు రాజకీయ నేతల లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మరోపక్క ఆంధ్రరాష్ట్రంలో విపక్ష పార్టీకి చెందిన నేతలు గరుడా లేదు డీలక్స్ లేదంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇదంతా టిడిపి పార్టీ డ్రామా అని పేర్కొంటున్నారు. ప్రజలలో సానుభూతి సంపాదించుకోవడానికి చంద్రబాబు వేసిన ప్లాన్ అని మరికొంతమంది నేతలు అంటున్నారు.