ఎన్నికల ముందు చంద్రబాబు కి దిమ్మ తిరిగిపోయే విధంగా సవాళ్లు వేసిన కన్నా లక్ష్మీనారాయణ

KSK
ముఖ్యమంత్రి చంద్రబాబుపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన కన్నా లక్ష్మీనారాయణ...స్వార్ధ రాజకీయాల కోసం చంద్రబాబు ఎంతటి దారుణానికైనా ఒడిగడతారు అని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు తన ఫొటోలు పెట్టుకుని రాజకీయ స్వార్థం కోసం పచ్చి అబద్ధాలు ఆడారు అని మండిపడ్డారు.  

విభజన తర్వాత రాష్ట్రంలో విద్యాసంస్థలు, పరిశ్రమలు, రోడ్లకు నిధులు.. ఇలా అన్నీ కేంద్రం ఇచ్చినవే. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరేం చేశారో దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయండి?’ అని సీఎం చంద్రబాబుకు కన్నా సవాల్‌ విసిరారు.2014 ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు వందలాది హామీలు ఇచ్చారు. కనీసం వాటిలో ఒకటైన పూర్తిగా నెరవేర్చార? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆనాడు ఎన్టీఆర్ స్థాపించిన టిడిపిని..తన స్వార్ధ రాజకీయాలకోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడానికి రెడీ అయిపోయిందా చంద్రబాబు పచ్చి అవకాశవాది అని విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి దిశా దశ లేదని పేర్కొన్నారు.

ప్రపంచంలో చంద్రబాబు కన్నా అవినీతిపరుడు మరొకరు లేరని,ఆపరేషన్‌ గరుడ అంటూ కొత్త నాటకంతో సినీనటుడు ముందుకు వచ్చాడని పేర్కొన్నారు. ఇంత దారుణంగా రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు త్వరలో ఆంధ్ర రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పుతో రాజకీయాల్లో కనుమరుగు అవుతారని కన్నా లక్ష్మీనారాయణ అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: