జనసేన మళ్ళీ మాట మార్చింది...!

Prathap Kaluva

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన స్పీచ్ లో ఆవేశంగా యువత గురించి మాట్లాడతాడు. యువత రాజకీయాల్లోకి రావాలని పలు సార్లు చెప్పాడు. ఇప్పుడేమో  జనసేనాని పవన్ కల్యాణ్ కు బలమైన నాయకులు కావాలట, అలాంటి వారి కోసం ఆయన వేచి చూస్తున్నారట. బలమైన నాయకులుంటేనే పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తారు, అందుకే వారికోసం చూస్తున్నాని చెప్పారు పవన్. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొంతమందికి హైదరాబాద్ ఆఫీస్ లో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కల్యాణ్.. తానింకా బలమైన నాయకుల కోసం అన్వేషిస్తున్నానని చెప్పుకొచ్చారు. 


యువతను రెచ్చగొట్టే ప్రసంగాలతో మొన్నటివరకు దంచికొట్టిన పవన్ సడన్ గా ఎందుకిలా మారిపోయారు. కొత్తవారితో పనికాదని అనుకుంటున్నారా లేక రాజకీయాలంటే అనుభవజ్ఞులే కావాలని అనుకుంటున్నారా. ఒకవేళ అలా అనుకుంటే ఇప్పటివరకూ పాలిటిక్స్ లో పాతుకుపోయినోళ్లంతా ప్రజల సొమ్ము దోచుకుతినడం అలవాటయిపోయిన వాళ్లని గగ్గోలు పెట్టడం ఎందుకు? 


ఇంతకీ ఆయన ఎవరికోసం చూస్తున్నట్టు.. ఇతర పార్టీల్లో నుంచి వచ్చే జంప్ జిలానీల కోసమా, లేక అక్కడ టికెట్ రాదు అని డిసైడ్ అయి ప్లేట్ ఫిరాయించే వాళ్లకోసమా? ఏదేమైనా మొత్తానికి తనకు సరుకు ఉన్నోళ్లు కావాలని ఆయనే బైటపడ్డారు.  పవన్ కు నిజంగా తనపై, తన ఆశయాలపై, తన ఇమేజ్ పై అంత నమ్మకం ఉన్నోడయితే ప్రతిచోటా కొత్తవారికి టికెట్లు ఇచ్చి గెలిపించుకోవాలి. అప్పుడు తెలుస్తుంది జనసేన సత్తా ఏంటో? పవన్ స్టామినా ఎంత అనేది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: