టీడీపీలో ఆ నలుగురుని టార్గెట్ చేసిన జగన్..?

KSK
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సంకల్ప పాదయాత్ర తో తన పార్టీ గ్రాఫ్ ను పెంచుకుంటూ ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతూ... వారి చేస్తున్న అవినీతిని బట్టబయలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు జగన్. ఈసారి ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని బలమైన ప్రభుత్వాన్ని స్థాపించి తన తండ్రి వలె పరిపాలించాలని మంచి కసిమీద వున్నారు జగన్.


ఇదే క్రమంలో అధికార పార్టీ తెలుగుదేశం నేతలు జగన్ దూకుడుకు కళ్లెం వేయాలని వ్యక్తిగతంగా దూషణలు చేస్తూ...విమర్శలకు తావిస్తూ తెగ రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు నేతలు వైసీపీ అధినేత జగన్ ని దారుణంగా తిడుతున్నారు.


జగన్ ప్రతిపక్ష నేత గా ఎన్నికైన అప్పటినుండి అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడే ఈ  నేతల...విషయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారట. రానున్న ఎన్నికల్లో జగన్ వారికి గట్టిగా టార్గెట్ పెట్టారట. ఇప్ప‌టి వ‌ర‌కూ బాబునే టార్గెట్ చేసిన జ‌గ‌న్ ఇక‌నుంచి ఆ నులుగురిని టార్గెట్ చేసుకోనున్నారంట‌.


మంత్రులు కె.అచ్చెంనాయుడు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, దేవినేని ఉమా మహేశ్వర రావులతో పాటు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీ‌నివాస‌రావుని ఏ విధంగానైనా ఓడించాలని జగన్‌ నిశ్చయించుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో వారికి దీటైన ప్రత్యర్థులను బరిలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నారు జగన్. మరి వచ్చే ఎన్నికల్లో మీరు గెలుస్తారో ఓడిపోతారో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: