జగన్ ను తిడుతున్న శివాజీ తెర వెనుక ఏం జరిగింది...!

Prathap Kaluva

శివాజీ ఆపరేషన్ గరుడ అంటూ కొన్ని రోజుల క్రితం హల్ చల్ చేసిన సంగతీ తెలిసిందే. ఏపీతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న అవకాశాలను వాడుకొనేందుకు ఓ జాతీయ పార్టీ ఆపరేషన్‌ ప్రారంభించింది. ఆపరేషన్‌ ద్రవిడ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక టాస్క్‌లో ఆపరేషన్‌ గరుడ కూడా భాగమే. తమిళనాడు, కేరళకు సంబంధించి ‘ఆపరేషన్‌ రావణ’, కర్ణాటకకు సంబంధించి ‘ఆపరేషన్‌ కుమార’ ఇందులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించింది ఆపరేషన్ గరుడ’ అని శివాజీ అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. 


అయితే ఇప్పుడు చంద్ర బాబు కు నోటీసులు రావడం తో శివాజీ చెప్పిందే నిజమే అని టీడీపీ నాయకులూ చెప్పుకుంటున్నారు. అయితే శివాజీ మాత్రం జగన్ తిడుతూ ఉండటం అందరికీ అనుమానాలు కలిగించే అంశాలు. శివాజీ పనీపాటా లేకుండా తిరుగుతున్నాడని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తనపై కామెంట్స్ చేశారని, జగన్‌కు ఏమన్నా పని ఉందా? అని శివాజీ మండిపడ్డారు. తన గురించి కొందరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, అయినా ఫర్వాలేదన్నారు.


ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తే.. తదుపరి ప్రభుత్వాలను మరొకరు కూలదోయరా? అని ప్రశ్నించారు. కుర్చీ కాంక్ష మొదలైనప్పుడే విధ్వంసం మొదలవుతుందని అన్నారు. జనవరిలో ఎన్నికలు వస్తాయని జగన్ ఎలా చెప్పగలుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఏదో విధంగా చంద్రబాబును ఒంటరి చేసి, ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తున్నారని ఆరోపించారు. దేశంలో మోదీకి ఎదురుగా నిలబడ్డ వ్యక్తి చంద్రబాబు ఒక్కరేనని వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితిలో మాట్లాడే అవకాశం చంద్రబాబుకు దక్కడం తెలుగుజాతికి గౌరవమని శివాజీ అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: