ఓటుకు నోటు కేసు గురించి రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..!
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ సర్కార్ లేఖ రాసిందని పేర్కొన్నారు. అంతేకాకుండా తన చుట్టూ, తన బంధువుల చుట్టూ తెరాస ప్రభుత్వం నిఘా పెట్టిందని రేవంత్ అన్నారు. తనకు గానీ, తన కుటుంబానికి గానీ ఏం జరిగినా కేసీఆర్, డీజీపీ, నిఘా ఐజీ ప్రభాకర్ రావుదే బాధ్యత అని హెచ్చరించారు. ఈడీని పంపినా.. వంద అక్రమ కేసులు పెట్టినా వదిలేది లేదన్నారు.
తనపై పెట్టిన ఓటుకు నోటు అక్రమ కేసు తప్పుడు కేసు అని గతంలోనే హైకోర్టు చెప్పిందని ఆయన అంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో మిగతా పార్టీ నాయకులు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని ఇందుమూలంగా రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ డ్రామాలు ఆడిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.