పోలీస్ వార్నింగ్ :ఎక్కువ మాట్లాడితే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నాలుక కోస్తాం..!

KSK
ఇటీవల ప్రబోధానందస్వామి పై చెలరేగిపోయిన అనంతపురం పార్లమెంటు సభ్యుడు టిడిపి నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి..తాజాగా ఏపీ పోలీసులపై మొత్తం పోలీసు వ్యవస్థపై ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేశారు. దీంతో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు సీఐ గోరంట్ల మాధవ్. పోలీస్ వ్యవస్థ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని నాలుక కోస్తాం అంటూ ఘాటుగా హెచ్చరించారు.


ప్రజలను పరిపాలించల్సిన ప్రజా ప్రతినిధులైన... ఎమ్మెల్యేలు ఎంపీలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు...అంతేకాకుండా మేమూ రాయలసీమ వాసులమేనన్న సీఐ అసభ్యపదజాలంతో మేమూ మాట్లాడగలమన్నారు.


రాజకీయ నాయకులకు కొమ్ము కాయడానికి పోలీసు వృత్తిలోకి రాలేదన్నారు. దివాకర్‌రెడ్డి పోలీసులకు క్షమాపణ చెప్పాలని సీఐ గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు. తాము మగాళ్లమయ్యే ఉద్యోగాలు చేస్తున్నామని శిఖండి కాదన్నారు. పోలీసులే కాదు పొలిటికల్ లీడర్లు ఫెయిల్ కారా అని ప్రశ్నించారు.


ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్నవారు ప్రతి పక్షం వారు పోలీసు వ్యవస్థకు గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాజకీయ నాయకులు పోలీసుల పై చేస్తున్న వ్యాఖ్యలకు కుటుంబ సభ్యులకు మొహం చూపెట్ట లేక పోతున్నామని పేర్కొన్నారు. ఈసారి నుండి పొలిటీషియన్ లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు సీఐ గోరంట్ల మాధవ్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: