రేవంత్ రెడ్డి గురించి సంచలన విషయాలు బయటపెట్టిన భూమన కరుణాకర్ రెడ్డి..!
రేవంత్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ, ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టగానే పచ్చ మీడియా ‘రేవంత్ పై పంజా’ ‘భావోద్వేగానికి లోనైన రేవంత్’ అంటూ సానుభూతి కథనాలను వండిందని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో డైరెక్టుగా దొరికిన దొంగను హీరోగా చూపడం వెనుక రహస్యం ఏంటని భూమన ప్రశ్నించారు. సోదాలల్లో బయటపడుతున్న సొమ్ము రేవంత్దా లేకా చంద్రబాబు నాయుడిదా అని ప్రశ్నించారు.
ఏపీ, తెలంగాణలో చట్టం, న్యాయం, రాజ్యాంగం అమలుకావడం లేదని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుని ఇప్పటి దాకా ఎందుకు ప్రశ్నించకుండా వదిలేశారని ఎందుకు విచారణ చేయటం లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ప్రజలు ఎన్నుకొన్న ప్రజాస్వామ్యాన్ని డబ్బులతో కొనుగోలు చేయడంలో చంద్రబాబు కి మించిన వారు లేరని తీవ్రస్థాయిలో మండిపడ్డారు భూమన కరుణాకర్ రెడ్డి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే చంద్రబాబు పాపం పండిందని త్వరలోనే తగిన శాస్తి అనుభవిస్తారని జోష్యం చెప్పారు భూమన కరుణాకర్ రెడ్డి.