సందుల్లో సభలు పెడితే ఇలాగే ఉంటుంది పవన్ కి అదిరిపోయే కౌంటర్ వేసిన దేవినేని ఉమ..!

KSK
ఏపీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా ఆయన చేపట్టిన కవాతు కార్యక్రమం బలప్రదర్శన రూపంలో ఉందని..దానిని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఏదో చేద్దామని అనుకుంటున్నారని..అటువంటి వాటిని చూసి తెలుగుదేశం పార్టీ బెదిరేది లేదని పేర్కొన్నారు.


గతంలో ధవలేశ్వరం బ్యారేజీపై విపక్ష నేత ప్రతిపక్ష నేత జగన్ డ్రోన్ల తో సినిమా చూపిస్తే దానికి పోటీగా పవన్ కళ్యాణ్ కవాతు నిర్వహించారని..సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


ఒకవైపు శ్రీకాకుళం జిల్లాలో తుఫానుకు గురై బాధితులు అల్లాడిపోతుంటే మరో పక్క పవన్ కళ్యాణ్ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం దురదృష్టకరమని అన్నారు దేవినేని ఉమ. అంతేకాకుండా సందుల్లో గొందుల్లో సభలు పెట్టి జనం ఎక్కువగా వచ్చినట్లు చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు.

ఇటీవల మావోయిస్టుల దాడిలో ఓ ఎమ్మెల్యే చనిపోతే బాధ్యత గల ప్రతిపక్ష నేత జగన్ ఇప్పటివరకు స్పందించలేదని..ఇదే క్రమంలో వైసీపీ పార్టీకి చెందిన బొత్స సత్యనారాయణ మావోయిస్టుల దాడులను నిరసిస్తూ ధర్నా చేద్దామని జగన్ కి సూచిస్తే..జగన్ ఆయన వైపు సీరియస్ గా చూశారని ఆరోపించారు దేవినేని ఉమ.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: