కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి...గవర్నర్ కి తెలియజేసిన పవన్..!
తిత్లీ తుఫాన్ ధాటికి ఉద్యానవనం లాంటి ఉద్దానం దారుణంగా నష్టపోయిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. తుఫాన్ కు ముందు ఉద్దానం ఎలా ఉంది తిత్లీ తర్వాత ఉద్దానం ఎలా ఉందో అన్న విషయాన్ని వీడియోల ద్వారా వివరించినట్లు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో ఆరు రోజులు పర్యటించి..48 గ్రామాల ప్రజలతో కలుసుకుని వారి బాధలను తెలుసుకున్నానని... రోజుకు దాదాపు 30 కిలోమీటర్లు నడిచారని తెలియజేశారు పవన్.
ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఎప్పటికీ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడం లేదని తెలియజేశారు. వెంటనే ఈ విషయంలో గవర్నర్ నరసింహన్ శ్రీకాకుళంలో జరిగిన ప్రకృతి వైపరీత్యాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని అందుకు కలిశామని స్పష్టం చేశారు పవన్.