జగన్ పై దాడి..ఆపరేషన్ గరుడ లో భాగమే..!

KSK
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా కావాలంటూ గతంలో ప్రత్యేక హోదా సాధన సమితి లో కీలకంగా వ్యవహరించిన సినీ నటుడు శివాజీ ఆపరేషన్ గరుడ అంటూ సంచలన కామెంట్ లు రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ నాయకులపై చేశారు. ఈ క్రమంలో తాజాగా ఇటీవల విశాఖపట్టణం విమానాశ్రయంలో ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై జరిగిన దాడిని ఆపరేషన్ గరుడ లో భాగంగానే జరిగిందని తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.


గతంలో ఆపరేషన్ గరుడ అంటూ హీరో శివాజీ అధికారంలో ఉన్న చంద్రబాబు పై కేంద్ర ప్రభుత్వం పలు కేసుల్లో ఇరికిస్తుంధాన్ని పేర్కొనడం జరిగింది. అయితే తాజాగా విశాఖపట్టణంలో జగన్ పై జరిగిన దాడి కూడా ఆపరేషన్ గరుడ లోని భాగం గానే పక్కా పథకం ప్రకారం,కేంద్ర ప్రభుత్వం చేయించిన చర్యగా ఇది ఉందని అనిపిస్తుంది అని కొంత మంది రాజకీయ నాయకులు వాదిస్తున్నారు.


శివాజీ చెప్పినటువంటి ఆ వీడియోలో ఒక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో అల్లర్లు జరుగుతాయని,బయట ప్రాంతాల నుంచి గాని,ఇక్కడ రాయసీమ ప్రాంతానికి చెందిన వారితోనే గాని ప్రతిపక్షాలపై దాడులు వంటివి జరుగుతాయని కానీ అవి వేరే రూపంలో రూపుదిద్దుకునే విధంగా ఉంటాయని పేర్కొన్నారు.


దీంతో ప్రస్తుత పరిస్థితులు బట్టి ఇదంతా ఆపరేషన్ గరుడ లో భాగమేనా లేకపోతే వేరే ఏవైనా వ్యూహాలు ఉన్నాయా అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: