నాడు ఇటలీ దయ్యం - నేడు ఇండియా దేవత: చంద్రబాబు నాలుక మడతేశారు

"చెరకు తుద వెన్నుపుట్టిన చెరకున తీపెల్ల చెరచు గదరా సుమతీ!" అన్న సుమతీ శతకకారుని అలోచనను అనుక్షణం ఋజువు చేసే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు  ఏ ఎండకు ఆ గొడుగు పట్టే,  ఈ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జన్మకు కారణ బూతమైన తెలుగు ప్రజల ఆత్మగౌరవ పరిరక్షణ అనే  సిద్దాంతం పునాదులపై తెలుగుదేశం పార్టీని నిర్మించారు వ్యవస్థాపక అధ్యక్షుడుగా నందమూరి తారక రామారావు. అలాంటి మూల సిద్ధాంతానికే చంద్రబాబు అనే చెదలు పట్టి, పార్టీ స్వరూప స్వభావాలు మట్టిలో కలసిపోతున్నాయి. మూల సిద్ధాంతానికే నేడు కాంగ్రెస్ వారసుడుగా ఉద్భవించిన రాహుల్ అనే కుక్కమూతి పిందే సమక్షంలో తిలోదకాలు ఇచ్చారు చంద్రబాబు.


సామాజిక మాద్యమం లేని రోజుల్లో,  జనాల మతి మరుపును తన బలంగా మలుచుకున్నాడు ప్రస్తుత టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. కానీ, ఇప్పుడు జనం చంద్రబాబు ఏం మాట్లాడినా చరిత్రలో ఆయన చేసిన తామర తంపరగా ఉన్న తప్పుల కుప్పలు ఎత్తిచూపుతున్నారు. రోజు కోసారి చంద్రబాబు తన పరువు, తన పార్టీ పరువు తానే తీస్తున్నారు. "నాలుక కు నరం ఉండదన్న" సామెత  ఆయన తన నాలుకను ఎన్ని రకాలుగా తిప్పగలడో చెప్పడానికి  "వారకాంత ఏ విటునితో నైనా పక్క  సిగ్గు లేకుండా ఏలా పంచుకోగలదో, అలా ప్రస్తుతానికి టిడిపి-కాంగ్రెస్ తో అక్రమ కూడికకు నాంది ప్రస్తావన జరపటం" తాజా ఉదాహరణ.


గత ఎన్నికల్లో చంద్రబాబు చేసిన ప్రచారం "అవీనితికి చిరునామా లాంటి కాంగ్రెస్ ను గద్దె దించండి. రాష్ట్రంలో కాంగ్రెస్ ను సమాధి చేయండి. దేశం నుంచి కాంగ్రెస్ ను బహిష్కరించండి. ఇటలీ దెయ్యం సోనియా ను తరిమి కొట్టండి. పప్పు నాయకత్వం మనకు వద్దు. మొద్దబ్బాయి రాహుల్ గాంధీ మనల్ని పాలించ గలడా? ఆ సామర్ధ్యం ఆయనకున్నట్లు కనిపించదు అని నొక్కి వక్కణించారు. ఇవి కాంగ్రెస్ గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. ఇపుడు అదే కాంగ్రెస్ దేశాన్ని రక్షిస్తుందని కబుర్లు చెబుతున్నాడు చంద్రబాబు.


ఇవి 2014 లో కాంగ్రెస్ గురించి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు. ఇపుడు 2019 ఎన్నికల కోసం అదే కాంగ్రెస్ దేశాన్ని రక్షిస్తుందని ఆయన చెపుతున్న మాటలు మనిషన్న వాడెవరైనా నమ్ముతాడా!  కబుర్లు చెప్పేది చంద్రబాబైతే వినేవాడు వెంగళాయి అన్నట్లు, "ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికా మాటలాడు" అన్న లోకోక్తి,  ఆనాడు నరేంద్ర మోడీ ప్రభంజనం ప్రభలంగా వీచినప్పుడు నరెంద్ర మోడీతో కలిసి, రాజకీయ ఎత్తుగడ కోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ రెండుగా చీల్చిందని - విభజనతో రాష్ట్రానికి తీవ్రద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్ అని దానిని పాతరెయ్యండని చెప్పి ఇపుడు అదే కాంగ్రెస్ ను గెలిపించమని చంద్రబాబు ప్రమోట్ చేస్తున్నాడు. 


ఇపుడు రాజకీయంగా కేంద్రంతో కయ్యాలు పెట్టుకుని రాష్ట్రాన్ని వెనక్కు తీసుకెళ్తున్న చంద్రబాబు, రాజకీయంగా తాను నిలబడటానికి, ఎపుడూ ఏదో ఒక పార్టీ అండ చూసుకుంటూ ఉంటారు. దాని కోసం ఏ సిద్ధాంతా నైనా వదిలెయ్యడానికైనా ఆయన వెనుకాడరు. చివరకు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన తన పార్టీని కాంగ్రెస్ తొత్తుగా కూడా మార్చేశారు నారా చంద్రబాబు నాయుడు. 


ఎపుడూ ఏదో ఒక పార్టీతో పొత్తు లేకపోతే ఆయన గారి టిడిపి గెలిచే పరిస్థితి రాష్ట్రంలో ఏనాడూ లేదు. తనకంటూ ఒక ప్రత్యేక సిద్ధాంతం ఉండదు. గాలి ఎటు మళ్ళితే అటు వెళ్ళే సంచార మెంటాలిటీ ఆయనది.  మొదట నరేంద్ర మోడీ చెప్పాడని "ప్రత్యేక హోదా" అవసరం లేదన్నాడు. జగన్మోహనరెడ్ది ఆ నినాదం ఇస్తే అరెస్టులు చేయమని ఆదేశించాడు. తీరా ఇపుడు తనకు అవసరం కాబట్టి మళ్లీ  " ప్రత్యేక హోదాకు జై కొడుతున్నాడు "


ఎన్నికల లోపు చంద్రబాబు తనలో ఇలా ఇంకెన్ని బహుముఖాలు చూపించ గలడో చూద్ధాం! ఇలాంటి ధౌర్భాగ్యపు మనస్తత్వాన్ని సాంప్రదాయ తెలుగు దేశం వాళ్లు భరిస్తారో? లేదో? ఎన్నికల్లో మాత్రం ప్రజలు తమ స్టాండ్ బలంగానే చూపటానికి సిద్దంగానే ఉన్నారు. ఎవరైనా బహిరంగంగా అక్రమ సంభందాన్ని అంగీకరించరు గదా! తెలుగు ప్రజలూ అంతే. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: