ఎన్నికలకు వెళ్లక ముందే తెలంగాణ మహాకూటమిలో వివాదాలు..!
14 స్థానాలను టీడీపీ, మిగిలిన 10 స్థానాలను టీజేఎస్, సీపీఐలకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. అయితే టీజేఎస్ మాత్రం తమకు 11 స్థానాలను కావాలని కోరుతోంది.
సీపీఐ కనీసం నాలుగు లేదా ఐదు అసెంబ్లీ స్థానాలను కోరుతోంది. అయితే వారు అనుకున్నన్ని సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా కనిపించడంలేదు. దీంతో మహాకూటమిలో ఉన్న రాజకీయ పార్టీల మధ్య ముఖ్యంగా టీజేఎస్ పార్టీ అధినేత కోదండరాం కాంగ్రెస్ పార్టీ వైఖరిపై చాలా కోపంగా ఉన్నట్లు తెలంగాణా రాజకీయాలలో వార్తలు వినబడుతున్నాయి.
మరోపక్క వామపక్ష పార్టీలు అని సిపిఐ కూడా కాంగ్రెస్ పార్టీ సీట్ల విషయంలో అనుసరిస్తున్న విధానంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఎన్నికలు రాకముందే పోటీచేసే స్థానాలలో మహాకూటమిలో గొడవలు ఏర్పడుతున్న నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ సైలెంట్ గా తన ప్రచార పర్వాన్ని కొనసాగిస్తూ దూసుకుపోతుంది.