అన్నీ కుదిరితే దేశ ప్రధాని చంద్రబాబే అంటున్న ఎంపీ రాయపాటి..!

KSK
దేశంలో త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల గురించి షాకింగ్ కామెంట్ చేశారు ఎంపీ రాయపాటి సాంబశివరావు. గుంటూరు జిల్లా పార్లమెంటు సభ్యులైన రాయపాటి  ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై మరియు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల పై తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు.


దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ప్రస్తుతం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాల కి అధికారంలో ఉన్న బీజేపీ నేతలకు చమటలు పడుతున్నాయని పేర్కొన్నారు ఎంపీ రాయపాటి. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో టిడిపి పార్టీ ఎక్కువ పార్లమెంటు స్థానాలు గెలిస్తే చంద్రబాబు దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.


గతంలో దేవెగౌడ తక్కువ సీట్లు గెలిచి కూడా ప్రధాని అయ్యారని అన్నారు. తాను నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని రాయపాటి స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దింపేందుకు.. చంద్రబాబు బీజేపీ యేతర శక్తులను ఏకం చేస్తున్న సంగతి తెలిసిందే.


ఈ నేపథ్యంలో ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అభినేత్రి మమతాబెనర్జీతో సీఎం చంద్రబాబు చేతులు కలపనున్నారు. ఈ క్రమంలో. ఎంపీ రాయపాటి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మరోపక్క ఎంపీ రాయపాటి కామెంట్లు పెట్టిన వైసీపీ నేతలు ఆపు నీ జోకులు అని ఎద్దేవా చేసినట్టు కౌంటర్లు వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: