పోలింగ్ బూత్ లోనే ఓటర్లకు బైకులు సెల్ ఫోన్లు...కలెక్టర్ నిర్ణయం..!

KSK
తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే రెండో అసెంబ్లీ ఎన్నికల విషయంలో సిద్దిపేట కలెక్టర్ తీసుకున్న నిర్ణయం ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీల తరఫున ప్రచారం మరియు మహాసభలు మొదలు పెట్టడం జరిగింది.


చాలా రాజకీయ పార్టీలు ఎక్కువ శాతం ప్రజల లోనే ఉంటూ హామీలు ఇస్తూ అసెంబ్లీ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ డి కృష్ణ భాస్కర్ జిల్లా ఓటర్స్ కి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు.


ఎవరైతే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారో వారి పేర్లను నమోదు చేసి  చీట్లు వేసి లక్కీ డ్రా నిర్వహిస్తామని..ఈ లక్కీ డ్రా లో వచ్చిన పేర్లకు బహుమతులు మరియు బైక్ గిఫ్ట్ ఆఫర్లు గా ఇస్తామని ప్రకటించారు.


అంతేకాకుండా సెల్ ఫోన్లు కూడా ఇస్తానని ప్రకటించడంతో సిద్దిపేట జిల్లాలో కలెక్టర్ చేసిన ప్రకటన పెద్ద చర్చనీయాంశం అయింది. దీంతో త్వరలో రానున్న ఎన్నికల్లో సిద్దిపేట జిల్లాలో ఎక్కువ వోటింగ్ నమోదుచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా కలెక్టర్ తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో పాటు చాలామంది ప్రముఖులు అభినందిస్తున్నారు. అంతేకాకుండా లక్కీ డ్రా పోలింగ్ బూత్ లోనే నిర్వహిస్తారని సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: