పవన్ కళ్యాణ్ నిత్య పెళ్ళికొడుకు! ఎదుటివారి మగతనాన్ని ప్రశ్నిస్తుంటాడు! వైఎస్ జగన్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నాలుగేళ్లకు ఒకసారి భార్యలను మారుస్తారంటూ ధ్వజమెత్తారు. కార్లను మార్చినట్టు భార్యలను మార్చే పవన్ కళ్యాణ్ తనను విమర్శిస్తున్నాడంటూ నిప్పులు చెరిగారు వైఎస్. జగన్మోహనరెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న వైఎస్.జగన్మోహనరెడ్డి శ్రీకాకుళం జిల్లా, రాజాం లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి భాగస్వామి అని అన్నారు.  
 
2014 నుంచి 2018 వరకు చంద్రబాబుతో కలిసి కాపురం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సరికొత్త రాగం ఎత్తుకున్నాడని విమర్శించారు. నాలుగున్నరేళ్ల కాలంలో చంద్రబాబు చేసిన అవినీతిలోనూ, మోసంలోనూ, తప్పుడు నిర్ణయాల్లోనూ, అరాచకపాలనలోనూ పవన్ కళ్యాణ్ కు భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. నాలుగేళ్లు చంద్రబాబుతో సంసారం చేసి ఇప్పుడు విడిపోయినట్లుగా నటిస్తూ మ్యాచ్-ఫిక్సింగ్ లకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. 

నాలుగు కోట్ల విలువైన భూమిని కారు చౌకగా అమరావతిలో పొందిన నీవు నన్ను విమర్శిస్తావా? అని జగన్మోహనరెడ్డి ఫినిషింగ్-టచ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ కు. అంతే కాదు ఇదంతా చంద్రబాబు తయారు చేసిన స్క్రిప్టులో భాగం గానే పవన్ కళ్యాణ్ తనపై చేస్తున్న విమర్శలని ఆయన అన్నారు.పవన్ కళ్యాణ్ నిత్య పెళ్లికొడుకు అని ఆయన ద్వజమెత్తారు.


చంద్రబాబు స్క్రిప్ట్ రాసి డైరెక్షన్ చేస్తే పవన్ కళ్యాణ్ యాక్షన్ చేస్తున్నాడంటూ మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సినిమాకు లింగమనేనని నిర్మాత అంటూ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ సినిమా కు ఇంటర్వేల్లు ఎక్కువ సినిమా తక్కువ అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు పేమెంట్లు చేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ కాల్షీట్లు ఇస్తాడంటూ దుమ్మెత్తి పోశారు. 


చంద్రబాబు చేస్తున్న అరాచకపాలనపై, అధర్మంపై పోరాటం చేసేది కేవలం జగన్మోహనరెడ్డి మాత్రమేనన్నారు. అలాంటి అధర్మ పాలనపై మాట్లాడని పవన్ కళ్యాణ్ తనపై మాత్రం విమర్శలు చేస్తాడని దుయ్యబుట్టాడు.  జగన్మోహన రెడ్డి అవినీతిపరుడు అంటున్న పవన్ కళ్యాణ్ నువ్వు చూశావా నా అవినీతిని? అంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందే తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పాలన జరిగిందన్నారు. అలాంటిది వైఎస్ రాజశేఖరరెడ్డి పై కూడా మాట్లాడతా డంటూ విమర్శించారు.  

తనను మగతనం అంటూ ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడం మగతనమా? పెళ్లిళ్లను అపహాస్యం చేయడమే మగతనమా? బార్యలను మార్చడం మగ తనమా? అని జగన్మోహన రెడ్డి ప్రశ్నించారు. ఒక పక్క చంద్రబాబు అవినీతిలో భాగస్వామిగా ఉంటూ తనపై విమర్శలు చేస్తారా? అని అన్నారు. పవన్ కళ్యాణ్ విలువలతో నిమిత్తం లేకుండా, వివాహం వ్యవస్థకు విలువ లేకుండా చేయడం మగతనమా? అని ఆయన అన్నారు.

పవన్ రెండో భార్య రేణూ దేశాయ్ ఏమన్నారో? గుర్తు చేసుకోవాలని అన్నారు. రేణు దేశాయ్ పై పవన్ అబిమానులు సోషల్ మీడియా లో వేదిస్తే మౌనంగా ఉండడమే మగతనమా? అని ఆయన అన్నారు. తనను ప్రశ్నిస్తే,  ప్రశ్నించిన వారి ఇళ్ల లోని ఆడవారి గురించి అసభ్యంగా మాట్లాడడమే మగతనమా? అని ఆయన అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: