దమ్మున్న చానల్ మీడియా సర్వే చూసి బెదిరిపోయిన టిడిపి నేతలు..!

KSK
ప్రజా సంకల్ప పాదయాత్ర తో దూసుకెళ్ళిపోతున్న వైసీపీ అధినేత జగన్ గురించి చంద్రబాబు కి మద్దతు తెలిపే ఓ మీడియా ఛానల్ కడప జిల్లాలో సర్వే నిర్వహించింది. 2014 ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతంలో అత్యధిక సీట్లు గెలుచుకున్న జగన్ రాబోయే ఎన్నికల్లో కూడా అదే జోరు కొనసాగిస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది.


ముఖ్యంగా 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఎక్కువ సీట్లు వచ్చిన రెండు గోదావరి జిల్లాలో రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తాజా సర్వేలో వెల్లడి అవడంతో ఏపీ టీడీపీ నేతలకు భయం పట్టుకున్న ట్లు సమాచారం.


మీడియా ఛానల్ లో దమ్మున్న చానల్ గా పేరుగాంచిన ఎల్లో మీడియా ఛానల్ పులివెందుల లో గెలుస్తామని డప్పాలు కొట్టిన చంద్రబాబుకు దిమ్మతిరిగే నిజాలను సదరు దమ్మున్న చానల్ బయటపెట్టింది. అధికారికంగా ఈ విషయాలను స్వయంగా తన మీడియాలో ప్రసారం చేయడంతో తెలుగుదేశం నేతల లో టెన్షన్ మొదలయ్యింది.


మరోపక్క గతంలో పులివెందులలోనే గెలుస్తామని టీడీపీ నేతలు మరియు చంద్రబాబు అన్న మాటలకు తాజా సర్వే ఫలితాలు బయటకు రావడంతో కంగుతిన్నట్లు అయింది. మొత్తంమీద జగన్ ఎన్నికల ముందు ప్రత్యర్థి పార్టీ లకు దిమ్మతిరిగిపోయే విధంగా తన ఓటు బ్యాంకును కాపాడుకోవడంలో సఫలం అవడంతో టీడీపీ నేతలకు భయం పట్టుకుంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: