లగడపాటి, ఆర్కేది శాడిజం.. బాబు బలిపశువు..?

Chakravarthi Kalyan

తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చి వారం రోజులు దాటుతున్నా విమర్శల సెగలు మాత్రం ఇంకా తగ్గడం లేదు. తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి కూడా ప్రజాకూటమి నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారని టీఆర్ఎస్ ఎంపీలు ఆరోపిస్తున్నారు. ప్రత్యేకించి లగడపాటి రాజగోపాల్, ఓ మీడియా సంస్థ ఎన్నికల ఫలితాలపై శాడిస్టుల్లా ప్రవర్తించారని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు.



అంతేకాదు. కాంగ్రెస్ పార్టీ తమ పరాజయాన్ని చంద్రబాబుకు అంటగట్టి ఆయన్ను బలిపశువును చేస్తున్నారని వినోద్ కుమార్ విమర్శించారు. చంద్రబాబు తెలంగాణలో ప్రచారం చేయడం వల్లే టీఆర్ఎస్ గెలించిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు... వాళ్లేవరో వస్తే కాదు.. రాష్ట్ర సంక్షేమ కోసం కృషి చేసిన కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు కోరుకున్నారు కాబట్టే టీఆర్ఎస్ గెలిచిందని వినోద్ వివరించారు.



ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడే మూడు రోజుల వరకు కాంగ్రెస్, చంద్రబాబు, లగడపాటి, కొన్ని మీడియా సంస్థలు పైశాచిక ఆనందాన్ని పొందాయని వినోద్ కుమార్ మండిపడ్డారు. పై స్థాయి లోని నేతలకు గెలుపు ఖాయమని తెలుసు కానీ కింది స్థాయి కార్యకర్తలను ఆ మూడు రోజులు దుష్ప్రచారంతో హింసించారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఓటమి ఒప్పుకొని టీఆర్ఎస్‌ చేసే అభివృద్ధి పనులను స్వాగతించాలని కోరారు.



ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని మరోఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఫ్లాగ్ షిప్ కార్యక్రమాలు దాదాపు 50 వరకు అమలు చేస్తున్నామని.. కానీ దేశంలో మోదీ చెప్పుకోవడానికి ఒక్క ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం కూడా లేదని విమర్శించారు. మాటలు తప్ప మోదీ దేశానికి చేసింది ఏమీ లేదన్నారు టీఆర్‌ఎస్‌ ఎంపీలు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: