చిత్తూరులో జగన్, పవన్ లపై సంచలన కామెంట్స్ చేసిన చంద్రబాబు..!

KSK
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇటీవల చిత్తూరు జిల్లాలో జరిగిన భారీ బహిరంగ సభలో వైసీపీ అధినేత జగన్ మరియు జనసేన బాధ్యతలు పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.


జగన్ మరియు పవన్ ఇటీవల తమ యాత్ర లో తెలుగుదేశం పార్టీపై మరియు తెలుగుదేశం నాయకుల పై సంచలన కామెంట్స్ మరియు అవినీతి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు.. జగన్, పవన్ లకు రెడ్డి కౌంటర్లు చేశారు. ఇద్దరికి రాష్ట్రాన్ని మోసం చేసిన ప్రధాని మోడీ ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేదని విమర్శించారు.


తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ గెలిస్తే..ఈ రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు రాష్ట్రంలో సంబరాలు చేసుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ప్రధాని మోడీ గురించి మాట్లాడుతూ..విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని కేంద్రం సహకరించక పోవడం వల్లే ముఖ్యంగా ప్రధాని మోడీ మొండి తనం వల్లే రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని..ఇదే క్రమంలో ప్రతిపక్ష పార్టీ అభివృద్ధిని అడ్డుకుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా రానున్న ఎన్నికల్లో ఏపీలో ప్రజలు తిరిగి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడం కాయం అని చంద్రబాబు అన్నారు. అంతేకాకుండా  రాష్ట్రానికి ఆరోగ్య కేంద్రంగా తిరుపతిని తీర్చిదిద్దుతామని ఈ సభలో హామీ ఇచ్చారు చంద్రబాబు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: