కమెడియన్ ఆలీ చుట్టూ తిరుగుతున్న ఆంధ్ర రాజకీయాలు..!

KSK
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు ముంచుకొస్తున్న క్రమంలో సినీ నటుడు ఆలీ చుట్టూ ఆంధ్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. తాజాగా అలీ ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు చంద్రబాబుతో ఏకాంతంగా ఆలీ సమావేశమయ్యారు.


చంద్రబాబుతో భేటీ అయిన అనంతరం  పవన్ కళ్యాణ్ తో కూడా భేటీ కాబోతున్నట్లు టాక్ వినపడుతుంది. ఇటీవల ఆలీ వైఎస్‌ఆర్‌సిపిలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబును కలవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైనది.


గత నెల ఎయిర్‌పోర్ట్‌లో జగన్‌, అలీ కలుసుకొవడంతో అప్పటి నుంచి అలీ వైఎస్‌ఆర్‌సిపికి వెళ్లున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వ్యాఖ్యలను నిజంచేస్తూ అలీ వైఎస్‌ఆర్‌సిపి తీర్ధం పుచ్చుకోబోతున్నారని ఆయన సన్నిహితులు చెప్పారు. ఈ నెల 9న వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌ పాదయాత్ర ముగుస్తున్న నేపథ్యంలో అదే రోజు వైఎస్‌ఆర్‌సిపిలో చేరేందుకు అలీ సిద్ధంగా ఉన్నారని సమాచారం.


మరోపక్క చాలా మంది సినీ ఇండస్ట్రీ నుండి వైసీపీ పార్టీ లోకి రావడానికి ఇష్టపడుతున్నట్లు తెలుగు సినిమా రంగం లో వార్తలు వినబడుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం కమెడియన్ ఆలీ తిరిగే రాజకీయాలలో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఏపీ రాష్ట్రంలో మూడు అతిపెద్ద పార్టీల అధ్యక్షులతో ఆలీ నేటి అవ్వటం ఆంధ్ర రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: