ఆ 2 పత్రికలపై యుద్ధం ప్రకటించిన జగన్..!? కేసీఆర్‌ బాటలోనే..!?

Chakravarthi Kalyan
తెలుగు రాష్ట్రాల్లో మీడియాపై రాజకీయ నేతల యుద్ధం జోరందుకుంటోంది. మొన్నటికి మొన్న తెలంగాణ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తూ కొన్ని బాకా పత్రికలు ఆయన్ను హీరోను చేస్తున్నాయని ఘాటుగానే మండిపడ్డారు. చంద్రబాబుకు భజన చేస్తున్నాయని తీరు మార్చుకోవాలని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.



ఇప్పుడు వైసీపీ అధినేత జగన్‌ కూడా కేసీఆర్ బాటలోనే సాగుతున్నారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో జగన్.. చంద్రబాబుతో పాటు ఆ రెండు పత్రికలపైనా యుద్ధభేరీ మోగించారుమరో మూడు నెలల కాలంలో ప్రతి ఒక్కరు సహకరించాలని, అవినీతి పాలనను సాగనంపేందుకు తోడుగా ఉండాలన్నారు జగన్.


ఈ యుద్ధం నారాసురుడు ఒక్కరిపైనే కాదు..ఆయనకు తోడుగా ఎల్లోమీడియా, వ్యవస్థలను మేనేజ్‌ చేసేవారున్నారు. వారితో కూడా మనం యుద్ధం చేయాలి అంటూ సమర శంఖం పూరించారుజిత్తులు మారిన మాయ చంద్రబాబు అనేకమైన పొత్తులు పెట్టుకుంటారని.. ఈ అన్యాయాలను, మోసాలను తాను సమర్థంగా జయిస్తానని జగన్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. మీరంతా తోడుగా ఉండమని, ఆశీర్వదించమని ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని జగన్ పాదయాత్ర ముగింపు సభలో కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: