ఏపీ రాష్ట్రమంతా జగన్ మేనియా..!

KSK
తాజాగా ఇటీవల ఇచ్చాపురంలో తాను తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర పూర్తయిన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో జగన్ చేసిన ప్రసంగం రాష్ట్రంలో ఉన్న ప్రతి సామాన్యుడిని ప్రభావితం చేసింది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ని నమ్మకూడదని నిన్ను నమ్మం బాబు అంటూ జగన్ ఇచ్చిన నినాదం రాష్ట్రంలో ప్రతి చిన్న పిల్లవాడిని సైతం కదిలించేలా చేసింది.


2017 వ సంవత్సరం నవంబరు 6 వ తారీఖున మొదలుపెట్టిన ఈ పాదయాత్ర రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా జగన్ ముగింపు సభకు వేలాది మంది తరలిరావడంతో సోషల్ మీడియాలో జగన్ గురించి మరియు ఆయన కమిట్మెంట్ గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు నెటిజన్లు.


నిజంగా ఆయన తండ్రి వైయస్సార్ రాష్ట్రానికి ఏ విధమైన మేలు చేశాడు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కచ్చితంగా జగన్ రాబోయే రోజుల్లో తన తండ్రికి మించిన పాలన అందిస్తారు అని అంటున్నారు చాలామంది సీనియర్ నెటిజన్లు.


ముఖ్యంగా ఇచ్చిన మాటకు నిలబడే నాయకుడు ఈ రోజుల్లో ఉండటం ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న యువతరం చేసుకున్న అదృష్టమని..రాబోయే రోజుల్లో జగన్ ముఖ్యమంత్రి అయితే వారి మీద ఉన్న బ్రతుకు భారం చాలా సులువుగా ఉంటుందని ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజానీకం జీవితాలలో వెలుగులు నింపుతాయి అని చాలామంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా జగన్ పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజల గుండెల్లో కి బలంగా వెళ్లారు అని అనటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: