చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్..!
ఎపి ప్రజలు అబివృద్ది,సంక్షేమం కోరుకున్నారని, కాని చంద్రబాబు ప్రతిదానికి సినిమా చూపిస్తూ కద నడుపుతున్నారని ఆయన అన్నారు. ఎపిలో టిడిపి మళ్లీ గెలిచే అవకాశం లేదని ఆయన అబిప్రాయపడ్డారు.
తెలంగాణలో ఆంధ్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఆంధ్రప్రదేశ్లో ప్రజల సొమ్ముతో చంద్రబాబు సొంత ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. హైటెక్ సిటీలో ఒక్క భవనం నిర్మించి.. అంతా తానే అభివృద్ధి చేశానంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ఏపీలో కుల రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబేనని, కాపులకు రిజర్వేషన్ల పేరుతో కులాల మధ్య కుంపట్లు పెడుతున్నారని తలసాని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిని జైల్లో పెట్టించిన చంద్రబాబు.. ఇప్పుడు హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తలసాని అన్నారు. హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే చంద్రబాబు ఎందుకు మద్దతివ్వలేదని ప్రశ్నించారు.