అమరావతిలో ప్రముఖ పొలిటిషన్ తో భేటీ కాబోతున్న చంద్రబాబు..?

KSK
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం గమనిస్తే రోజుకో విధంగా క్షణానికో రకంగా కనబడుతుంది. మొన్నటి వరకు వైసిపి పార్టీ వైపు చూసిన చాలామంది ప్రముఖ నేతలు ఇప్పుడు తాజాగా చంద్రబాబు చేస్తున్న ప్రకటనలకు ప్రజల నుండి వస్తున్న స్పందన చూసి టీడీపీ వైపు చూస్తున్నారు.


ముఖ్యంగా 2014 ఎన్నికలలో రాయలసీమ ప్రాంతంలో వైసీపీ పార్టీ భయంకరమైన హవా చూపించింది అయితే తాజాగా రాయలసీమ ప్రాంతంలో పరిస్థితి గమనిస్తే చాలా వరకు తెలుగుదేశం పార్టీ క్రమక్రమంగా మెరుగుపడుతుంది. ఈ క్రమంలో తాజాగా రాజకీయాలలో ప్రముఖ కుటుంబం అయిన మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి కుమారుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి తాజాగా తెలుగుదేశం పార్టీ లోకి రావడానికి ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది.


ఈ నేపథ్యంలో త్వరలో అమ‌రావ‌తిలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు టీడీపీ అధినేత చంద్రబాబుని కలవనున్నారని సమాచారం. ఈ వార్తతో సూర్య ప్రకాష్ రెడ్డి గారు టీడీపీలో కలవనున్నారని అందరు అనుకుంటున్నారు. దీంతో కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి గారు టీడీపీలో చేరిపోవడం ఖాయం అని చాలామంది అంటున్నారు.


మరోపక్క వైసీపీ పార్టీలో కూడా కచ్చితంగా కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి పార్టీలోకి వస్తారని మరికొంతమంది నేతలు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నికలు వస్తున్న క్రమంలో ఆంధ్రాలో కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి పొలిటికల్ ఎపిసోడ్ అన్ని పార్టీలకు ఆసక్తికరంగా మారింది. మరి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ఏ పార్టీలోకి వెళతారో.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: