హంతకుడు రాకేశ్‌ కు లింకు లోకేశ్‌తోనా..? జగన్‌ తోనా..?

Chakravarthi Kalyan
జయరామ్ హత్య కేసు నిందితుడు రాకేశ్‌ కు రాజకీయ ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. రాకేష్ రెడ్డి తెలుగుదేశం నేత అని, ఆయనకు ఎపి ముఖ్యమైన బాద్యతలలో ఉన్న లోకేశ్‌ తో సంబంధాలు ఉన్నాయని ఓ పత్రికలో వార్తలు వచ్చాయి. లోకేశ్‌తో అపాయింట్‌మెంట్లు ఇప్పించే స్థాయికి వెళ్లిపోయారని ఆ కథనం చెబుతోంది.



కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు రాజకీయ సంబంధాలు పెట్టుకున్న రాకేష్‌ కొందరు ముఖ్యమైన నాయకులు, మరికొందరు రాజకీయ నాయకుల కుమారులతో సన్నిహితంగా ఉండేవాడని సమాచారం. రాజకీయ నాయకుల కుమారులు తమ వ్యక్తిగత అవసరాలు తీర్చుకునేందుకు రాకేష్‌ను ఉపయోగించుకున్నారని తెలుస్తోంది. కొందరు నేతలు రాకేష్‌ ప్రలోభాలకు ఆకర్షితులై అతనితో సంబంధాలు కొనసాగించగా, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన మరికొందరు నేతలు మాత్రం దూరం పెట్టారని సమాచారం.



అయితే రాకేశ్‌కు ఓ ముఖ్యనేత, ప్రధాన నేతలతో సంబంధం ఉందని ప్రముఖ తెలుగు దిన పత్రిక రాయడం విశేషం. చంద్రబాబు, లోకేశ్‌ లకు వ్యతిరేకంగా ఆపత్రిక రాసే అవకాశం లేకపోవడంతో అది వైసీపీ అధినేత జగనే కావచ్చని మరికొందరు ఊహిస్తున్నారు. మరి ఇంతకీ రాకేశ్ కు సంబంధం ఉన్నది లోకేశ్‌ తోనా.. జగన్‌తోనా.. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: